చట్టసభల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఈ బడ్జెట్ ఉపాధికల్పన, వ్యవసాయం, సంక్షేమరంగాల సమానాభివృద్దికి... సమప్రాధాన్యం ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు.
వ్యవసాయ అనుబంధ వృత్తులకు 50 శాతానికి పైగా నిధులు ఖర్చు చేస్తూ... శాశ్వత అభివృద్ధికి దారులు వేసిందన్నారు. సంక్షేమం, శాశ్వత అభివృద్ధిని కలిపి ఎలా ముందుకు తీసుకుపోవాలో... ఇతర రాష్ట్రాలకు సూచించే దిక్సూచిలా మన బడ్జెట్ ఉందని మంత్రి కొనియాడారు.
ఇదీ చదవండి: తెలంగాణ బడ్జెట్ రూ.2,30,825 కోట్లు