ETV Bharat / state

రాష్ట్రంలో కొవిడ్​ జేఎన్​ 1 వ్యాప్తి - 14కు చేరిన పాజిటివ్​ కేసులు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 20, 2023, 10:57 PM IST

Updated : Dec 21, 2023, 7:40 AM IST

Minister Damodar Raja Narasimha Review on Corona
రాష్ట్రలో కొవిడ్​ మరణం నమోదు - 14కు చేరిన పాజిటివ్​ కేసులు

Minister Damodar Raja Narasimha Review on Corona : రాష్ట్రంలో కొవిడ్ విజృంభిస్తుండటంతో , రాష్ట్రం ఆరోగ్యశాఖ మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 538 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్​గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Minister Damodar Raja Narasimha Review on Corona : రాష్ట్రంలో 24 గంటల్లో 6 కొవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 538 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ఆరుగురు పాజిటివ్​గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ బాధితుల సంఖ్య 14కు చేరగా, ఒకరు రికవరీ అయినట్లు స్పష్టం చేసింది. ఈరోజు పాజిటివ్​గా నిర్ధారణ అయిన మొత్తం 6 కేసులు హైదరాబాద్​కు చెందినవి కావడం గమనార్హం. ప్రస్తుతం యాక్టీవ్​గా ఉన్న కేసుల్లో ఒకటి కరీంనగర్​కు చెందినది కాగా మిగతా అన్ని హైదరాబాద్​ నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న విషయం.

'ప్రతి 3 నెలలకోసారి మాక్ డ్రిల్​'- కొవిడ్ కేసులపై కేంద్రం అలర్ట్

కొవిడ్​ నియంత్రరణపై మంత్రి రాజనర్సింహా సమీక్ష : కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సన్నద్ధంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహా వైద్య ఆరోగ్య శాఖ(Health Minister) సిబ్బందిని ఆదేశించారు. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాల మంత్రులతో కొవిడ్ సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహా, అనంతరం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. వైద్యులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Telangana Government Guidelines on Covid 19 : ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా నిర్వహించిన సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, డీహెచ్ రవీంద్రనాయక్, డీఎంఈ త్రివేణి, గాంధీ ఆస్పత్రి సూపరిండెంట్ రాజారావు, ఉస్మానియా(Osmania) సూపరిండెంట్ నాగేంద్ర సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు. గురువారం అన్ని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ల్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఆసుపత్రులు అవసరమైన వనరులను టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారా తీసుకోవాలని చెప్పారు.

Covid 19 JN1 Variant : ఇన్​ఫ్లూయెంజా వంటి లక్షణాలు ఉంటే కొవిడ్ పరీక్షలు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహా స్పష్టం చేశారు. పాజిటివ్ వచ్చిన శాంపిళ్లను విధిగా ఉప్పల్​లోని సీడీఎఫ్​డీకి పంపాలన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులను మంత్రికి వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేట్ కేవలం 0.31 శాతంగా ఉన్నట్టు తెలిపారు.

రాష్ట్రంలో 9కి చేరిన కొవిడ్ కేసుల సంఖ్య - ముందస్తు చర్యల్లో అధికారులు

తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం - అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి

Last Updated :Dec 21, 2023, 7:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.