ETV Bharat / state

సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలి: అల్లోల

author img

By

Published : Mar 26, 2021, 7:53 PM IST

minister allola indrakaran reddy review with officials
అధికారులతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి సమీక్ష

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై ప్రజాప్రతినిధులు, నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి సమీక్షించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో అరణ్యభవన్​లో మంత్రి సమీక్షించారు.

చ‌నాకా-కొరాటా, లోయ‌ర్ పెన్​గంగా, ప్రాణ‌హిత‌, నీల్వాయి, జ‌గ‌న్నాథ‌పూర్, కుమురం భీం, కుప్తి ప్రాజెక్టులు, చెన్నూర్ ఎత్తిపోతల, కాళేశ్వరం ప్రాజెక్టు 27, 28 ప్యాకేజీలు, క‌డెం ప్రాజెక్ట్ ప‌నులు, చెక్​డ్యాంల నిర్మాణాల‌పై స‌మావేశంలో స‌మ‌గ్రంగా చ‌ర్చించారు. తమ తమ నియోజకవర్గాల్లోని సాగునీటి అవసరాలు, చేపట్టాల్సిన పనులను ప్రజాప్రతినిధులు వివరించారు. కొన్నిచోట్ల గుత్తేదారులు ప‌నులు నిలిపివేశార‌ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

వెంటనే స్పందించిన మంత్రి పనులు చేయలేని స్థితిలో ఉన్న గుత్తేదార్లను తొలగించి.. ఆ పనులను కొత్తవారికి అప్పగించాలని అధికారుల‌ను ఆదేశించారు. ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణలోకి తీసుకోవాలని, ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల‌పై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారన్న ఆయన.. స‌మావేశంలో చ‌ర్చించిన అంశాల‌ను ముఖ్యమంత్రికి నివేదిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: బడ్జెట్ సమావేశాలు హుందాతనాన్ని ప్రతిబింబించాయి: ప్రశాంత్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.