ETV Bharat / state

'పీఆర్​సీ నూటికి నూరు శాతం అమలు చేస్తాం'

author img

By

Published : Jan 3, 2023, 9:06 PM IST

Media conference on TRVKS PRC: పీఆర్​సీపై వార్త పత్రికల్లో వస్తున్న కథనాలుపై టీఎస్​ ట్రాన్స్​కో అండ్ టీఎస్​ జెన్​కో సీఎమ్​డీ దేవులపల్లి ప్రభాకర్​రావు స్పష్టత ఇచ్చారు. ఈరోజు టీఆర్​వీకెఎస్​ సంఘ రాష్ట్ర అధ్యక్షులు మీడియా సమావేశంలో దేవులపల్లి ప్రభాకర్​రావు ఆరోగ్యం గురించి, పీఆర్​సీ వంటి విషయాలను తెలిపారు.

Media conference on TRVKS PRC
పీఆర్​సీపై నూటికి నూరు శాతం అమలు చేస్తాం

Media conference on TRVKS PRC: టీఎస్​ ట్రాన్స్​కో అండ్ టీఎస్​ జెన్​కో సీఎం​డీ దేవులపల్లి ప్రభాకర్​రావుని టీఆర్​వీకేఎస్​ సంఘ రాష్ట్ర అధ్యక్షులు, ఇతరులు కలశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారు చెప్పిన వివరాలు ప్రకారం.. టీఎస్​ ట్రాన్స్​కో అండ్ టీఎస్​ జెన్​కో సీఎం​డీ దేవులపల్లి ప్రభాకర్​రావు ఆరోగ్యం బాగోలేదని తెలిసి హైదరాబాద్​లో వారి నివాసంలో కలసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నామన్నారు. ఆయన విపరీతమైన దగ్గు, వైరల్ ఫీవర్​తో బాధపడుతున్నారని చెప్పారు.

కొన్ని పత్రికల్లో పీఆర్​సీపై వస్తున్న కథనాలుపై ఆయన స్పందించారు. పీఆర్​సీపై ఎటువంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దని నూటికి నూరు శాతం అమలు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. తన ఆరోగ్యం కుదుట పడిన వెంటనే విధుల్లోకి చేరుతారని చెప్పారు. విద్యుత్ ఉద్యోగుల ప్రధాన సమస్యలను టీఆర్​వీకేఎస్​ సంఘ పక్షాన పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో టీఆర్​వీకెఎస్ సంఘానికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.