ప్రభుత్వం ఆస్తి పన్ను చెల్లింపుల కోసం ప్రకటించిన ఎర్లీ బర్డ్ పథకానికి హైదరాబాద్ నగరంలో మంచి స్పందన లభిస్తోందని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. నివాస గృహాలతో పాటు వాణిజ్య ఆస్తులకు ఎర్లీ బర్డ్ పథకం కింద 5 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
2020-21 మే నెలఖరు వరకు రూ. 522 కోట్లు
2019-20 మే నెలాఖరు వరకు రూ. 567 కోట్లు
ఇవాళ రాత్రి 12 గంటల వరకు ఎర్లీ బర్డ్ కింద 5 శాతం రాయితీతో ఆన్లైన్లో ఆస్తిపన్ను చెల్లించవచ్చని మేయర్ తెలిపారు. మీసేవ, సిటిజన్ సర్వీస్ సెంటర్లు సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాయని... ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. గతేడాది కంటే ఆస్తి పన్ను అధికంగా వసూలు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: త్రిశూల వ్యూహంతో లాక్డౌన్ 5.0- కొత్త రూల్స్ ఇవే...