ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ప్రతాప్ గౌడ్​ను 8గంటల పాటు విచారించిన సిట్

author img

By

Published : Nov 26, 2022, 7:06 PM IST

Updated : Nov 26, 2022, 7:32 PM IST

MLAs poaching case updates
MLAs poaching case updates

18:58 November 26

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ప్రతాప్ గౌడ్​ను 8గంటల పాటు విచారించిన సిట్

MLAs poaching case updates: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగంగా చేస్తోంది. నిన్న న్యాయవాది ప్రతాప్ గౌడ్, నందకుమార్ భార్య చిత్రలేఖను ప్రశ్నించిన సిట్ అధికారులు.. మరోసారి ప్రతాప్‌ను ఇవాళ 8గంటలపాటు విచారించారు. ఆర్ధిక లావాదేవీల వివరాలపై ప్రశ్నించిన అధికారులు.. రాంచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ ఖాతాలనుంచి నగదు బదిలీపై సిట్ ఆరాతీసింది. గతంలో నందకుమార్ అంబర్‌పేటలో హోటల్ నిర్వహించగా.. అదే ప్రాంతానికి చెందిన ప్రతాప్ అతనికి భారీగా డబ్బు ఇచ్చినట్లు సిట్ అధికారులు సమాచారం సేకరించారు.

నిందితులు కేంద్రప్రభుత్వ అధీనంలో కీలకపదవి ఇప్పిస్తామని నమ్మించడంతో భారీగా డబ్బు ఇచ్చానని ప్రతాప్ గౌడ్ అంగీకరించినట్లు తెలిసింది. ఆ విషయంలో నిందితులకు, ప్రతాప్ గౌడ్‌కు మధ్య జరిగిన పలు సంభాషణలు లభ్యమైనట్లు సమాచారం. ప్రతాప్‌గౌడ్ ఫోన్​లలో అవి రికార్డు కావడంతో ఆధారాల నిమిత్తం సిట్ స్వాధీనం చేసుకుంది. రాంచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్‌తో ప్రతాప్‌ పలు ప్రయాణాలు చేసినట్టు గుర్తించిన అధికారులు ..అతని స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. నందకుమార్ భార్య చిత్రలేఖను సోమవారం మరోసారి విచారణకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు.

ఇవీ చదవండి: ఎమ్మెల్యేల ఎర కేసు... చిత్రలేఖపై 8 గంటలపాటు సిట్‌ ప్రశ్నల వర్షం..

టిఫా స్కానింగ్​తో శిశువుల్లో లోపాలను గుర్తిద్దాం: హరీశ్‌రావు

ఆఫ్తాబ్​కు 13 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ.. శ్రద్ధ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి!

Last Updated : Nov 26, 2022, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.