KTR on Investment Roundtable Meeting : 'తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది'

author img

By

Published : May 12, 2023, 10:25 PM IST

KTR

KTR on Investment Roundtable Meeting in London : పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారిందని కేటీఆర్ తెలిపారు. లండన్​లో నిర్వహించిన ఇన్వెస్ట్​మెంట్​ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

KTR on Investment Roundtable Meeting in London : పెట్టుబడులకు తెలంగాణ అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానమని మంత్రి కేటీఅర్ పేర్కొన్నారు. లండన్​లోని భారత హై కమిషనర్ విక్రం కె.దురై స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇన్వెస్ట్​మెంట్​ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలు కంపెనీల ప్రతినిధులు, తదితరులకు రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాల గురించి కేటీఆర్​ వివరించారు.

రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు : ఈ క్రమంలోనే తెలంగాణలోని ప్రాథమిక సమస్యలన్నింటి పైన దృష్టి సారించామని కేటీఆర్ చెప్పారు. అందుకనుగుణంగా వాటి పరిష్కారానికి ప్రయత్నించామని పేర్కొన్నారు. ఇన్నోవేషన్, మౌలిక వసతుల సదుపాయాల కల్పన వంటి అంశాలపైన 9 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్.. ఫుడ్ ప్రాసెసింగ్, మొబిలిటీ, టెక్స్​టైల్​ వంటి రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను కేటీఆర్ వివరించారు.

హైదరాబాద్​లో ఉన్న ఇన్నోవేషన్ ఈకో సిస్టం.. పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు, స్టార్టప్​లు, ప్రపంచ ప్రసిద్ధ కంపెనీల వలన ఆయా రంగాల్లో అభివృద్ధి వేగంగా కొనసాగుతుందని కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​ రంజన్ తెలంగాణ ఇన్వ్​స్ట్​మెంట్​ ప్రమోషన్ ఎన్నారై అఫైర్స్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో లండన్‌ స్టాక్​ ఎక్స్ఛేంజ్ గ్రూప్‌ కేంద్రం : అంతకుముందు రాబోయే సంవత్సర కాలంలో 1000 మందికి ఉపాధి కల్పించేలా.. హైదరాబాద్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు లండన్‌ స్టాక్​ ఎక్స్ఛేంజ్ గ్రూప్‌ ప్రకటించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఎంఓయూపై ఐటీ, పరిశ్రమల శాఖల ప్రధాన కార్యదర్శి జయేశ్​ రంజన్, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ సీఈఓ ఆంథోనీ మెక్‌కార్తీ సంతకాలు చేశారు.

మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. జూన్ 12 నుంచి 15వరకు జర్మనీలోని బెర్లిన్‌లో నిర్వహించనున్న ఆసియా-బెర్లిన్ సదస్సు 2023కు రావాలని కోరుతూ.. ఆయనకు నిర్వహకులు ఆహ్వానం పంపారు. కనెక్టింగ్​ స్టార్టప్ ఎకో సిస్టమ్ అనే అంశంపై నిర్వహించనున్న ఈ సదస్సులో ప్రసంగించాలని వారు కోరారు.

ఇవీ చదవండి : Kishan Reddy on Dharani Portal : 'ధరణి పోర్టల్‌ వచ్చింది ప్రజల కోసం కాదు.. BRS నేతల కోసం'

Jowar Procurement : జొన్న రైతులకు శుభవార్త .. మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే పంట కొనుగోలు

'మెజారిటీ లేకున్నా అధికారం.. బీజేపీ ప్లాన్​-బీ రెడీ!'.. జేడీఎస్ కలిసేది వారితోనే!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.