ETV Bharat / state

'అసలైన ఆట ఇప్పుడే మొదలైంది.. మరింత కసిగా పనిచేస్తాం'

author img

By

Published : Nov 7, 2022, 2:14 PM IST

Kishan Reddy respond on Munugode By Poll Result
Kishan Reddy respond on Munugode By Poll Result

Kishan Reddy reaction on Munugode By Poll Result: రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నికల ఫలితాల్లో గులాబీ జెండా ఎగిరింది. భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా డిపాజిట్‌నే కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి స్పందించారు. మునుగోడులో నైతిక విజయం భాజపాదేనని తెలిపారు.

Kishan Reddy reaction on Munugode By Poll Result: మునుగోడు ఉపఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి స్పందించారు. మునుగోడులో నైతిక విజయం భాజపాదేనని స్పష్టం చేశారు. తాము ఎన్నికలో ఓడినా.. మునుగోడు ప్రజల నమ్మకాన్నిగెలిచామని అన్నారు. ప్రలోభాలు, బెదిరింపులతో తెరాస గెలిచిందని ఆరోపించారు. మునుగోడులో డిపాజిట్ రాని పరిస్థితి నుంచి రెండో స్థానంలోకి వచ్చామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కల్వకుంట్ల కుటుంబానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని కిషన్​రెడ్డి వ్యాఖ్యానించారు. అసలైన ఆట ఇప్పుడే మొదలైందని చెప్పారు. ఇక నుంచి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత కసిగా పనిచేస్తామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో విజయం మాదే.. కేసీఆర్‌ పాలనను అంతం చేస్తామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

ఇవీ చదవండి: మునుగోడు ఉపఎన్నిక.. ఓటమిపై కారణాలు వెతుక్కుంటున్న భాజపా

అభ్యంతరాలుంటే చెప్పండి.. తెరాస పేరు మార్పుపై బహిరంగ ప్రకటన

EWS 10 శాతం రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు సమర్థన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.