ETV Bharat / state

Karnataka Results Heat On Telangana : కర్ణాటక ఫలితాలపై.. రాష్ట్ర నేతల్లో ఉత్కంఠ

author img

By

Published : May 12, 2023, 9:02 PM IST

Karnataka Results Heat On Telangana : కర్ణాటక ఎన్నికల ఫలితాలపై తెలంగాణ కమలనాథుల్లో ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని.. ఒక వేళ ఓటమి చెందితే ఆ ప్రభావం తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని రాష్ట్ర కమలదండు భావిస్తోంది. కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపడితే.. రాష్ట్రంలో ఆ పార్టీ కొంత మేరకు బలోపేతం అయ్యే అవకాశం ఉందని.. పార్టీని వీడే వారి సంఖ్య తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Karnataka Results
Karnataka Results

Karnataka Results Heat On Telangana : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడుతున్న వేళ.. తెలంగాణలో రాజకీయ పరిణామాలపైన చర్చలు ఊపందుకున్నాయి. కర్ణాటక గెలుపోటములపై ఎవరి లెక్కలు వారేసుకుంటున్నారు. ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపగా.. మరికొన్ని హంగ్ వస్తుందని తేల్చేశాయి. వీటి వల్ల ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో గందరగోళం నెలకొంది. అక్కడ ఫలితాలు ఎలా ఉన్న.. ఆ ప్రభావం రాష్ట్ర రాజకీయాలపైన ప్రభావితం చూపుతుందనే చర్చ జరుగుతోంది.

ఏ రాష్ట్ర రాజకీయాలు ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమవుతాయని.. మరికొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో కమలం వికసిస్తే.. తమకు కలిసి వస్తుందని తెలంగాణ బీజేపీ నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ ఎన్నికలు ముగిసిన వెంటనే.. తెలంగాణపైనే తమ తదుపరి లక్ష్యమని పార్టీ అగ్ర నేతలు గత కొంతకాలంగా చెబుతున్నారు.

ఇప్పుడు ఈ ఫలితాలపైనే : ఈ క్రమంలోనే దక్షిణాదిన సెకండ్ గేట్ వేగా తెలంగాణ కాబోతోందని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రంలో బీజేపీ బలోపేతం చేరికలపైనే ఆధారపడి ఉందని.. కర్ణాటకలో కమలం గెలిస్తే చేరికలు సైతం ఊపందుకుంటాయని తెలంగాణ నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే అనేక మంది నేతలతో చర్చలు జరిపిన కాషాయదళం.. ఇప్పుడు ఈ ఫలితాలపైనే.. వీరందరి రాక ఆధారపడి ఉందని చెబుతున్నారు.

తెలంగాణలో పార్టీకి పెద్దగా నష్టం ఉండదన్న అభిప్రాయం : కర్ణాటకలో బీజేపీ అధికార పగ్గాలు చేపడితే.. నేతలంతా పార్టీలో చేరేందుకు క్యూ కడతారని యోచిస్తున్నారు. అక్కడ కమలం అధికారంలోకి వస్తే ఇక్కడ కాంగ్రెస్​కు గడ్డు పరిస్థితులు ఎదురుకావడం ఖాయమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక బీజేపీ కర్ణాటకలో ఓడిపోతే ఏంటి పరిస్థితి అన్న దానిపైనా రాష్ట్ర నాయకుల్లో చర్చ జరుగుతోంది. అక్కడ హంగ్ వచ్చినా.. కాంగ్రెస్ పార్టీ వచ్చినా.. తెలంగాణలో పార్టీకి పెద్దగా నష్టం ఉండదన్న అభిప్రాయంతో ఉన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే.. కొద్ది రోజుల పాటు రాష్ట్ర బీజేపీలోకి చేరికలు ఆగిపోయే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ ప్రభావం ఎక్కువ రోజులు ఏమీ ఉండదని.. రెండు మూడు నెలల పాటు పార్టీ కార్యక్రమాల్లో స్తబ్దత నెలకొంటుందని చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నందున ఎన్నికల నాటికి తిరిగి పుంజుకునేందుకు అవకాశం ఉంటుందని కాషాయ దళం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

తెలంగాణ రాజకీయాల్లో కాక : ఒకవేళ కర్ణాటకలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపడితే.. రాష్ట్రంలో హస్తం పార్టీ కొంత మేరకు బలోపేతం అయ్యే అవకాశం ఉందని.. పార్టీని వీడే వారి సంఖ్య తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో.. అక్కడి ప్రజలు ఏమీ తీర్పు ఇచ్చారో మరికొద్దీ గంటల్లో వెలువడనున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది.

ఇవీ చదవండి : Kishan Reddy on Dharani Portal : 'ధరణి పోర్టల్‌ వచ్చింది ప్రజల కోసం కాదు.. BRS నేతల కోసం'

'మెజారిటీ లేకున్నా అధికారం.. బీజేపీ ప్లాన్​-బీ రెడీ!'.. జేడీఎస్ కలిసేది వారితోనే!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.