'దావూద్ ఇబ్రహీంకు రాజ్యసభ సీటు ఇస్తే ఇంకా బావుండేది'

author img

By

Published : May 19, 2022, 7:41 PM IST

Ka paul

KA Paul On TRS Rajya Sabha Candidates: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తెరాస రాజ్యసభ అభ్యర్థులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. రాజ్యసభకు పంపడానికి అమరవీరుల కుటుంబాల నుంచి అర్హులే లేరా అని ప్రశ్నించారు.

KA Paul On TRS Rajya Sabha Candidates: ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ద్రోహి అని మరోసారి రుజువైందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి రాజ్యసభకు ఎంపిక చేసిన ముగ్గురు వ్యక్తులు ఎవరని ఆయన ప్రశ్నించారు. కుంభకోణాలు, అక్రమార్కులు, భూ కబ్జాదారులకు పాల్పడిన వారిని రాజ్యసభకు పంపిస్తారా అంటూ నిలదీశారు. 1,200 మంది అమరవీరుల కుటుంబాల్లో ఒకరు కూడా అర్హులు లేరా అని ప్రశ్నించారు. ఒకరు మైనింగ్‌ డాన్‌ రవిచంద్ర, మరొకరు రూ. 500 కోట్ల స్కామ్‌లో పట్టుబడిన పార్థసారధిరెడ్డి, గచ్చిబౌలిలో భూకబ్జాలు చేసిన దామోదర్‌రావును ఎంపిక చేశారని ఆరోపించారు.

వీరికి ఏ అర్హత ఉందని రాజ్యసభకు పంపుతున్నారని కేఏ పాల్‌ నిలదీశారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలన సాగుతోందన్న పాల్... ఈ పాలనను అంతం చేసేందుకు చివరి వరకు పోరాటం చేస్తానన్నారు. తెరాసలో ఉన్న ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు ఏమాత్రం సిగ్గు, బుద్ధి ఉన్నా పార్టీ నుంచి బయటకు రావాలన్నారు. అక్రమాలు, అవినీతి పాలనను ప్రశ్నించేందుకు, తెలంగాణను అప్పుల నుంచి విడిపించి బంగారు తెలంగాణ చేయడమే తన లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే రాజ్యసభకు ఎంపిక చేసిన ముగ్గురిని వెంటనే విత్‌ డ్రా చేయించి... అమరవీరుల కుటుంబాలకు సీట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్ తెలంగాణ ద్రోహి. తెలంగాణ అమరవీరుల వ్యతిరేకి. అన్ని కులాల వ్యతిరేకి. కేసీఆర్ మూడు రాజ్యసభ సీట్లు ఎవరికి నామినేట్ చేశారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కరోనా కష్టకాలంలో కృత్రిమ కొరత సృష్టించి... తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి కోట్లు కూడబెట్టుకున్న హెటిరో ఛైర్మన్ పార్థసారథి రెడ్డికి రాజ్యసభ సీటు కేటాయించారు. ఈయన ఎవరు... రెమిడెసివర్ అక్రమ నిల్వలు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన పార్థసారథి కంటే గొప్పవాడు తెలంగాణలో లేడా? గవర్నమెంట్ ట్యాక్స్​లు, మైనింగ్ ట్యాక్స్​లు ఎగ్గొట్టిన మైనింగ్ డాన్ రవిచంద్రకు రాజ్యసభ సీటు కేటాయింపా? దుబాయ్ డాన్, పాకిస్థాన్ డాన్, బొంబాయి డాన్ అని ఒకయన్ని అంటారు. ఆయన దావూద్ ఇబ్రహీంకు రాజ్యసభ సీటు ఇస్తే ఇంకా బాగుండేది కదా. పెద్ద డాన్ మిమ్మల్ని కాపాడుతాడు. గచ్చిబౌలిలో 300 ఎకరాల భూ ఆక్రమణ కేసులో ఏ-1 ముద్దాయిగా ఉండటమేనా రాజ్యసభ సీటుకు అర్హత దామోదర్​ రావు? కాంగ్రెస్, భాజపా, తెరాసలో ఉన్న నాయకులు మంచి చేయాలనుకునే వారంతా ప్రజాశాంతి పార్టీలో చేరండి. - కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

'దావూద్ ఇబ్రహీంకు రాజ్యసభ సీటు ఇస్తే ఇంకా బావుండేది'
  • ఇదీ చదవండి :

పొలంలో ఇద్దరు పోలీసుల మృతదేహాలు.. ఏం జరిగింది?

మైనర్లకు మద్యం అమ్మకం.. బార్లకు దిమ్మతిరిగే షాక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.