రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేయనున్న 119 బీసీ గురుకులాల్లో 1,608 పోస్టులు రానున్నాయి. ఈ గురుకులాలను 2019-20 విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించేలా కార్యాచరణను బీసీ గురుకులాల సొసైటీ ఇప్పటికే వేగవంతం చేసింది. జూన్ 1న ఒకేసారి ప్రారంభించేలా, భవనాల గుర్తింపు దాదాపు పూర్తయింది. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించటం, భద్రత కోసం సిబ్బందిని నియమించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు.
టీజీటీలో 1,073, పీఈటీ-119, లైబ్రేరియన్లు-119, స్టాఫ్ నర్సులు-119, జూనియర్ అసిస్టెంట్లు-100, ప్రధాన అధ్యాపకులు-36 పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఇవీ చూడండి: మే తొలివారంలో పదో తరగతి ఫలితాలు..?