ETV Bharat / state

Jaipur Express RPF Constable Attack Update : జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో కాల్పుల ఘటన.. మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

author img

By

Published : Aug 5, 2023, 5:12 PM IST

Updated : Aug 5, 2023, 9:29 PM IST

Etv Bharat
Etv Bharat

Jaipur Express RPF Constable Attack Update : జైపూర్‌ ఎక్స్‌ప్రెస్​లో ఇటీవల జరిగిన కాల్పుల్లో మృతి చెందిన హైదరాబాదీ.. సయ్యద్‌ సైఫుద్దీన్‌ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి.. ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు రెండు పడక గదుల ఇల్లు మంజూరు పత్రం మంత్రి కేటీఆర్ మృతుడి భార్యకు అందజేశారు.

Firing in Central Superfast Express at Maharashtra : జైపూర్​ ఎక్స్​ప్రెస్​ రైల్లో ఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​ కాల్పుల ఘటనలో మృతి చెందిన హైదరాబాదీ సయ్యద్‌ సైఫుద్దీన్‌ భార్య అంజుమ్‌ షాహీన్‌కు తెలంగాణ సర్కార్ అండగా నిలిచింది. సైఫుద్దీన్‌ భార్య అంజుమ్ షాహీన్‌ ఇవాళ అసెంబ్లీ ఆవరణలో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అంజుమ్ షాహీన్‌ను కులీకుతుబ్‌షా అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీలో ఆఫీస్ సబార్డినేట్‌గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల ప్రతిని కేటీఆర్ ఆమెకు అందజేశారు. దీంతో పాటు జియాగూడలో రెండు పడక గదుల ఇంటి మంజూరు పత్రాన్ని ఇచ్చారు.

KTR Giving 6 Lakh for Syed Saifuddin Family : బీఆర్​ఎస్​ పార్టీ తరఫున రూ.రెండు లక్షలు, మజ్లిస్​ పార్టీ నుంచి రూ.లక్ష చొప్పున ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. ఈ మేరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ మృతుడి భార్యకు చెక్కులు అందజేశారు. ఈ ఘటనలో ఓ అధికారి, ముగ్గురు ప్రయాణికులు చనిపోయారు. అందులో హైదరాబాదీ సయ్యద్‌ సైఫుద్దీన్‌ ఒకరు. అతనికి ముగ్గురు కుమార్తెలు. పిల్లలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున ఆరు లక్షల రూపాయలను బీఆర్​ఎస్ తరఫున అందజేశారు. సైఫుద్దీన్‌ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, తదితరులు పాల్గొన్నారు.

Gun Firing At Old City : పాతబస్తీలో కాల్పుల కలకలం.. లైసెన్స్​డ్​ రివాల్వర్​తో..

అసలు ఏం జరిగిందంటే ..: మహారాష్ట్రలోని పాల్ఘర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో జైపుర్‌-ముంబయి సెంట్రల్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఇటీవల ఆర్​ఫీఎఫ్​ కానిస్టేబుల్ చేతన్‌ సింగ్‌ తన పైఅధికారి ఏఎస్సై టికా రామ్​ మీనాన్​పై ఏకే-47 తుపాకీతో కాల్పులు చేశాడు. దీంతో అధికారి మృతి చెందాడు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం ఆ కానిస్టేబుల్ రైలులోని ఎస్​6,​ బీ5 బోగీల్లో ఉన్న ప్యాంట్రీ కార్​లో ఒక్కో ప్రయాణికుడి చొప్పున కాల్పులు చేశాడు. ఆ ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు.

వెంటనే రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు రైలు చైన్ లాగారు. అది గమనించిన నిందితుడు రైలు నుంచి దూకి తప్పించుకునే సమయంలో.. రైల్వే పోలీసులు, ఆర్​ఫీఎఫ్​ సిబ్బంది నిందితుడిని పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి అధికారులు కాల్పులు జరిపిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడ్ని స్థానిక పోలీస్ స్టేషన్​కి తీసుకెళ్లారు. ఇందులో మృతి చెందిన హైదరాబాదీ వ్యక్తి మృతదేహాన్ని స్వస్థలం అయిన కర్ణాటకలోని బీదర్​కు తరలించారు. బాధితుడు తన కుటుంబంతో హైదరాబాద్​లోని నాంపల్లిలో నివసించేవాడు. కోఠి దగ్గర సయ్యద్​ గుజరాత్​ గల్లీలోని ఓ మొబైల్​ షాపులో ఉద్యోగిగా పని చేశాడు.

MP Asaduddin Owaisi Tweet on Gun Firing Incident : ఈ రైలులో జరిగిన ఘటనపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఘటన జరిగిన వెంటనే స్పందించారు. ఈ దాడులు కచ్చితంగా ఉగ్రదాడులే అని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఘటనపై ట్వీట్​ చేశారు. దేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా నిరంతరం చేస్తున్న దాడులు, ద్వేషపూరిత ప్రసంగాలకు బీజేపీ మద్దతుదారులు రెచ్చగొడుతున్నారని ఆయన వివరించారు.

RPF Constable Gun Firing Case Update : జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌లో కాల్పుల ఘటన.. హైదరాబాదీ మృతి

gun firing at shamirpet : శామీర్‌పేట్‌ సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల కలకలం.. కుటుంబ కలహాలే కారణం

హైదరాబాద్‌ శివారులో తెరాస నాయకులు కాల్పులు, వీడియో వైరల్

Last Updated :Aug 5, 2023, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.