కోర్టుధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జైలు శిక్ష విధించింది. పూనం మాలకొండయ్య, వీరపాండ్యన్, అరుణ్కుమార్కు నెలపాటు జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. కర్నూలు వ్యవసాయ సహాయకుడి విషయంలో తీర్పు అమలు చేయలేదని దాఖలైన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. తీర్పు అమలులో నిర్లక్ష్యం వహించినందుకు అధికారులకు జైలు శిక్ష విధించింది. వీరపాండ్యన్, అరుణ్ విజ్ఞప్తితో 6 వారాల పాటు జైలుశిక్ష అమలును నిలుపుదల చేసింది. కోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్లో పూనం మాలకొండయ్య పిటిషన్ వేయగా.. ధర్మాసనం తోసిపుచ్చింది.
ఇవీ చూడండి: