ETV Bharat / state

పంచాయతీ ఎన్నికలు వద్దనడంపై రామ్​ మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

author img

By

Published : Jan 24, 2021, 11:14 AM IST

పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కోరటం వెనుక కరోనా కంటే పెద్ద కారణం ఉందేమో అని భాజపా నేత రామ్ మాధవ్ అన్నారు. చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు... ఏపీలో నిర్వహించలేమనటం సహేతుకం కాదన్నారు.

ప్రభుత్వం వద్దనడం వెనుక పెద్ద కారణం ఉందేమో: ఎంపీ రామ్​ మాధవ్​
ప్రభుత్వం వద్దనడం వెనుక పెద్ద కారణం ఉందేమో: ఎంపీ రామ్​ మాధవ్​

ప్రభుత్వం వద్దనడం వెనుక పెద్ద కారణం ఉందేమో: ఎంపీ రామ్​ మాధవ్​

కరోనా కారణంగా ఏపీలో పంచాయతీ ఎన్నికలు వాయిదా కోరడం సహేతుకం కాదని భాజపా నేత రామ్ మాధవ్‌ అన్నారు. చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు చక్కగా జరుగుతున్నాయని తెలిపారు. కరోనా కంటే పెద్ద కారణం ఏమైనా ఉందేమో అని అన్నారు. శనివారం విశాఖలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రతి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని... ఏపీలో మాత్రం వచ్చిన సంస్థలు వెనక్కి వెళ్తున్నాయని రామ్ మాధవ్ విమర్శించారు. వైకాపా ప్రభుత్వం వివాదాలతో కాలక్షేపం చేయకుండా.. రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా ఆలయాలపై దాడులు జరుగుతున్నాయనే విషయం దిల్లీ దృష్టికి వచ్చిందని తెలిపారు.

ఇదీ చదవండి: శ్రీవారి సన్నిధిలో గవర్నర్ తమిళిసై!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.