ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీలకంగా ఐఎస్: కేంద్రం

author img

By

Published : Sep 17, 2020, 12:28 PM IST

islamic-state-terrorists-most-active-in-telugu-states-says-ministry-of-home-affairs-in-rajya-sabha
తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీలకంగా ఐఎస్: కేంద్రం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) అత్యంత క్రీయాశీలంగా ఉందని కేంద్ర హోంశాఖ రాజ్యసభలో తెలిపింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) అత్యంత క్రీయాశీలకంగా ఉందని కేంద్రం పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో ఐఎస్‌కు సంబంధించి 122 మంది నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిందని తెలిపింది.

ఆయా రాష్ట్రాల్లో ఐఎస్‌కు సంబంధించి 17 కేసులు నమోదైనట్లు బుధవారం రాజ్యసభలో ఎదురైన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి... లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ఇదీ చదవండి: అమరవీరుల స్ఫూర్తి కేంద్రం నిర్మించాలి: కిషన్​రెడ్డి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.