ETV Bharat / state

Hyderabad Young Woman Gang Rape in UP : యూపీలో హైదరాబాద్​ యువతిపై గ్యాంగ్​రేప్.. ఉద్యోగం కోసం వెళ్తే దారుణం

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 19, 2023, 9:54 AM IST

Updated : Oct 19, 2023, 10:01 AM IST

Gang Rape on a Young Woman from Hyderabad in up
Gang Rape on a Young Woman from Hyderabad in Lucknow

Hyderabad Young Woman Gang Rape in Uttar Pradesh : ఉద్యోగం వెతుక్కుంటూ ఉత్తరప్రదేశ్​కు వెళ్లిన హైదరాబాద్​కు చెందిన ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. జాబ్​ ఇప్పిస్తానని నమ్మబలికి అక్కడకు పిలిపించిన ఆమె స్నేహితుడు.. మరో ఇద్దరితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్​ చేశారు.

Hyderabad Young Woman Gang Rape in Uttar Pradesh : ఉత్తర్​ప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడి జాంకీపురం పోలీస్​స్టేషన్​ పరిధిలో హైదరాబాద్​కు చెందిన ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి యువతిని అక్కడకు పిలిపించిన మనీశ్​ శర్మ అనే యువకుడు.. తన ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు జాంకీపురం పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేశారు.

Girl Gangrape By 7People : 15ఏళ్ల బాలికపై ఏడుగురు గ్యాంగ్​రేప్​.. ఆ ఫొటోలు చూపిస్తూ.. బెదిరించి మరీ..

హైదరాబాద్​కు చెందిన ఓ యువతి కొద్ది రోజుల క్రితం ఉద్యోగం కోసం లక్నో వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు తనకు ఉద్యోగం ఇప్పించాలంటూ హైదరాబాద్​లోని తన స్నేహితుడిని కోరగా.. అతడు తన మిత్రుడు మనీశ్​ శర్మతో ఈ విషయం చెప్పాడన్నారు. దాంతో అతడు యువతికి జాబ్​ ఇప్పిస్తానని చెప్పి లక్నోకు రమ్మన్నాడని.. మనీశ్​ శర్మ చెప్పినట్లుగానే యువతి ఇటీవల హైదరాబాద్​ నుంచి విమానంలో లక్నో చేరుకోగా.. విమానాశ్రయంలో ఆమెను రిసీవ్​ చేసుకున్నట్లు వివరించారు. నిందితుడు ఆమెను జాంకీపురంలోని తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ హోటల్​లో ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు.

మరో 'నిర్భయ' ఘటన.. మైనర్​పై గ్యాంగ్​రేప్​.. ప్రైవేట్ భాగాల్లో కర్ర చొప్పించి..

ఈ నెల 18న (బుధవారం) మనీశ్​ తన ఇద్దరు స్నేహితులు తుకారాం, అభిషేక్​లతో కలిసి యువతి ఉంటున్న హోటల్​కు వచ్చాడని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం కాసేపు ఆమెతో మాట్లాడారని.. ఈ క్రమంలోనే ఒకరి తర్వాత ఒకరు బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడించారు. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై సెక్షన్​ 376డి కింద కేసు నమోదు చేసి అరెస్ట్​ చేసినట్లు స్టేషన్​ ఇంఛార్జ్​ తెలిపారు. ఈ మేరకు యువతి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చామన్నారు.

తల్లీకూతుళ్లపై 8మంది గ్యాంగ్​ రేప్​.. ప్రైవేట్​ పార్ట్​లపై కారం చల్లి..

"యువతి హైదరాబాద్​లో ఉన్నప్పుడు ఉద్యోగం ఇప్పించాలని తన స్నేహితుడిని కోరింది. అతడు లక్నోలో ఉన్న తన మిత్రుడు మనీశ్​ శర్మకు విషయం చెప్పడంతో అతడు యువతిని లక్నో రమ్మన్నాడు. అతడు చెప్పినట్లుగానే యువతి హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​లో లక్నోకు చేరుకోగా ఎయిర్​పోర్ట్​లో ఆమెను రిసీవ్​ చేసుకున్నాడు.​ ఆమెను జాంకీపురంలోని తన ఇంటికి దగ్గరలో ఉన్న ఓ హోటల్​లో ఉంచాడు. బుధవారం తన ఇద్దరు స్నేహితులు తుకారాం, అభిషేక్​లతో కలిసి యువతి ఉంటున్న హోటల్​కు వెళ్లిన నిందితుడు.. ఆమెతో కాసేపు మాట్లాడాడు. అనంతరం ఒకరి తర్వాత ఒకరు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 376డి కింద కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేశాం. ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించాం." - జాంకీపురం పోలీస్​స్టేషన్​ ఇంఛార్జీ

కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్​రేప్​.. ఆపై బయటికి తోసేసి..

Last Updated :Oct 19, 2023, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.