ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు. నిందితుల నుంచి 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరితోపాటు బైకులు కొంటున్న మరో ఐదుగురిపై కూడా కేసులు నమోదు చేశారు. పేపర్ బాయ్లా పనిచేస్తూ తెల్లవారుజామున నకిలీ తాళం చెవులతో అపార్ట్ మెంట్ల వద్ద వాహనాలను చోరీ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
జల్సాలకు అలవాటు పడి ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచనతోనే గోవర్ధన్, శేషయ్యలు దొంగతనాలకు పాల్పతున్నట్లు పశ్చిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరించారు. దొంగిలించిన వాహనాలను అవసరం ఉన్న వారికి తక్కువ రేటుకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: తెలంగాణ నేలపై డైనోసార్లు