ETV Bharat / state

జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు

author img

By

Published : Jun 6, 2020, 11:01 PM IST

హైదరాబాద్ నగరంలో సంచలనం రేకెత్తించిన జంట హత్యల కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. హత్యకు పాల్పడ్డ ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ అంజనీకుమార్​ తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో ఈ జంట హత్యలు జరిగినట్లు సీపీ వెల్లడించారు.

Hyderabad CP Anjani kumar ON DOUBLE MURDER in Mehdipatnam
జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ మెహదీపట్నంలోని ఎండీలైన్స్‌లో రౌడీ షీటర్‌, అతని స్నేహితుడి జంట హత్యల కేసులో ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు నగర పోలీస్​ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. హత్యలు జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బంది, అధికారులను ఆయన అభినందించారు.

హత్యలకు పాల్పడే వారు... ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సీపీ స్పష్టం చేశారు. పాత కక్షల నేపథ్యంలో ఈ జంట హత్యలు జరిగినట్లు ఆయన వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.