రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను హోంమంత్రి మహమూద్ అలీ పరామర్శించారు. బుధవారం హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాతపడ్డారు. చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుగురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. వీరంతా హైదరాబాద్లోని తాడ్బండ్కు చెందినవారు. మృతుల బాధిత కుటుంబాలు... పాతబస్తీ కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన వారు. బాధిత కుటుంబ నివాస స్థలాలకు వెళ్లిన హోంమంత్రి వారిని పరామర్శించారు.
ఇదీ చూడండి: మల్కాపూర్ గేటు వద్ద ఘోరప్రమాదం.. ఏడుగురు దుర్మరణం