ETV Bharat / state

మృతుల కుటుంబాలకు హోంమంత్రి పరామర్శ

author img

By

Published : Dec 3, 2020, 9:38 PM IST

బుధవారం హైదరాబాద్‌- బీజాపూర్‌ జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్​ పాతబస్తీలోని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాతపడ్డారు. బాధిత కుటుంబాలను హోంమంత్రి మహమూద్ అలీ పరామర్శించారు.

మృతుల కుటుంబాలకు హోంమంత్రి పరామర్శ
మృతుల కుటుంబాలకు హోంమంత్రి పరామర్శ

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను హోంమంత్రి మహమూద్ అలీ పరామర్శించారు. బుధవారం హైదరాబాద్‌- బీజాపూర్‌ జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాతపడ్డారు. చేవెళ్ల మండలం మల్కాపూర్‌ గేటు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుగురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. వీరంతా హైదరాబాద్​లోని తాడ్‌బండ్‌కు చెందినవారు. మృతుల బాధిత కుటుంబాలు... పాతబస్తీ కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన వారు. బాధిత కుటుంబ నివాస స్థలాలకు వెళ్లిన హోంమంత్రి వారిని పరామర్శించారు.

ఇదీ చూడండి: మల్కాపూర్ గేటు వద్ద ఘోరప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.