ETV Bharat / state

రాష్ట్రంలో భానుడి భగభగలు.. గరిష్ఠ ఉష్ట్రోగ్రత ఎక్కడంటే..!

author img

By

Published : May 24, 2022, 5:41 PM IST

రాష్ట్రంలో భానుడి భగభగలు.. గరిష్ఠ ఉష్ట్రోగ్రత ఎక్కడంటే..!
రాష్ట్రంలో భానుడి భగభగలు.. గరిష్ఠ ఉష్ట్రోగ్రత ఎక్కడంటే..!

రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వడగాల్పుల భయంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పగటిపూటే కాదు రాత్రి ఉష్ణోగ్రతలూ అసాధారణంగా పెరుగుతున్నాయి.

రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచే భగ్గుమంటున్నాడు. ఫలితంగా బయట అడుగు వేస్తేనే.. నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టుగా అనిపిస్తోంది. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా.. వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయుడుపేటలో అత్యధికంగా 44.0 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం జిల్లాలోని మధిరలో 43.9, జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లెగోరిలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబాబాద్​ జిల్లాలోని గర్లలో 43.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

రాష్ట్రంలో భానుడి భగభగలు.. గరిష్ఠ ఉష్ట్రోగ్రత ఎక్కడంటే..!
రాష్ట్రంలో భానుడి భగభగలు.. గరిష్ఠ ఉష్ట్రోగ్రత ఎక్కడంటే..!

ఇదీ చూడండి..

Rains in Telangana: రాష్ట్రంలో రాగల మూడురోజులపాటు మోస్తరు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.