ETV Bharat / state

'కరోనా బాధితులకు ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయండి'

author img

By

Published : Jun 5, 2020, 2:12 PM IST

health employees jac meet minister eetala rajendar
మంత్రి ఈటలను కలిసిన వైద్యారోగ్యా ఐకాస

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో కొవిడ్​ బాధితుల కోసం ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాలని తెలంగాణ వైద్యారోగ్య ఐకాస నాయకులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హైదరాబాద్​ కోఠిలోని వైద్యవిద్యా సంచాలకుల కార్యాలయంలో మంత్రి ఈటల రాజేందర్​తో సమావేశమయ్యారు.

తెలంగాణలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బాధితుల కోసం అన్ని ఆసుపత్రుల్లో ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య ఐకాస కోరింది. ఈ మేరకు ఐకాస నాయకులు హైదరాబాద్​ కోఠిలోని వైద్య విద్యా సంచాలకుల కార్యాలయంలో ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్​తో సమావేశమై పలు అంశాలను చర్చించారు.

కొవిడ్​ -19 ఐసోలేషన్​ ఆసుపత్రులను పూర్తిగా కరోనా వైద్యశాలలుగా మార్చి... పాజిటివ్​ కేసులున్నవారిని అక్కడే చికిత్స అందించాలని ఐకాస ఛైర్మన్​ కోరారు. వైరస్​ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు వారం నుంచి పది రోజుల క్వారంటైన్​ ఇవ్వాలన్నారు. వైద్యుల కుటుంబాలకు కరోనా సోకకుండా తమకు వసతిని ఏర్పాటు చేయాలని మంత్రి ఈటలకు విజ్ఞప్తి చేశారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.