ETV Bharat / state

వర్చువల్ విధానంలో గవర్నర్ తమిళిసై అపాయింట్‌మెంట్లు

author img

By

Published : Feb 24, 2021, 7:53 PM IST

ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసై వర్చువల్ విధానంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. అపాయింట్‌మెంట్ తీసుకున్న వారితో లైవ్​లో మాట్లాడనున్నారు. హైదరాబాద్ రాజ్‌భవన్ నుంచి తమిళిసైతో మాట్లాడే వెసులుబాటు కల్పించారు.
వర్చువల్ విధానంలో గవర్నర్ తమిళిసై అపాయింట్‌మెంట్లు
వర్చువల్ విధానంలో గవర్నర్ తమిళిసై అపాయింట్‌మెంట్లు

అదనపు బాధ్యతల్లో పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వర్చువల్ విధానంలో మాట్లాడనున్నట్లు తెలిపారు. అపాయింట్‌మెంట్ తీసుకున్న వారు హైదరాబాద్ రాజ్​భవన్ దర్బార్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ సదుపాయంలో గవర్నర్​తో మాట్లాడే వెసులుబాటు కల్పించారు. అపాయింట్‌మెంట్ ​కోసం ఈ-మెయిల్ ద్వారా రాజ్​భవన్ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.

హైదరాబాద్ ​రాజ్​భవన్ అధికారులతో ఇవాళ దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించిన తమిళిసై... రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. తాను ఎక్కడున్నా తెలంగాణ ప్రజల బాగోగుల కోసం నిరంతరం కృషి చేస్తున్నానని వెల్లడించారు. ఈ-ఆఫీస్ విధానంలో అన్ని ఫైళ్లను పరిష్కరించినట్లు తెలిపారు.

రెడ్ క్రాస్ సంస్థ బాధ్యులతోనూ సమీక్షించిన తమిళిసై... దాతల్లో స్ఫూర్తి నింపి రక్తదానానికి ముందుకొచ్చేలా ప్రోత్సహించాలని సూచించారు. ఛాన్స్​లర్ కనెక్ట్స్ అలూమ్నీ కార్యక్రమం ద్వారా పూర్వ విద్యార్థులను రాజ్ భవన్ వెబ్ సైట్ ద్వారా అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.