ETV Bharat / state

KCR vs Governor Tamilisai: 'తెలంగాణలో ప్రోటోకాల్ పాటించటం లేదు'

author img

By

Published : Apr 24, 2023, 3:46 PM IST

Updated : Apr 24, 2023, 4:54 PM IST

CM KCR vs Governor Tamilisai: తెలంగాణలో గత కొంత కాలంగా సీఎం కేసీఆర్​, గవర్నర్​ తమిళిసై మధ్య నడుస్తున్న వివాదం మరింత తారస్థాయికి చేరుతోంది. తాజాగా గవర్నర్ మరోసారి కేసీఆర్​పై ఆరోపణలు చేశారు. ఆర్టికల్‌ 167 ప్రకారం గవర్నర్‌తో సీఎం చర్చించాలి కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదని అన్నారు. సీఎం, గవర్నర్‌ మధ్య సుహృద్భావ వాతావరణం లేదని తెలిపారు.

KCR vs Governor Tamilisai
KCR vs Governor Tamilisai

CM KCR vs Governor Tamilisai: రాష్ట్ర సీఎం కేసీఆర్​, గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​ మధ్య నడుస్తోన్న వివాదం తెలిసిందే.. అయితే తాజాగా తమిళిసై మరోసారి కేసీఆర్​పై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో ప్రోటోకాల్ పాటించటం లేదని ఆరోపించారు. ఆర్టికల్‌ 167 ప్రకారం గవర్నర్‌తో సీఎం చర్చించాలి కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని తెలిపారు.

కాలానుగుణంగా గవర్నర్‌తో సీఎం చర్చలు తప్పనిసరి అని సూచించారు. రెండేళ్లుగా సీఎం తనను సంప్రదించలేదని ఆరోపించారు. సీఎం, గవర్నర్‌ మధ్య సుహృద్భావ వాతావరణం లేదని ప్రకటించిన ఆమె.. సుహృద్భావ వాతావరణం లేకపోవడానికి తాను కారణం కాదని ప్రకటించారు.

వివాదం ఎప్పటిది: గవర్నర్​, ప్రభుత్వానికి మధ్య నడుస్తోన్న వివాదం ఇప్పటిది కాదు. గత రెండేళ్లుగా ప్రగతిభవన్​, రాజభవన్​ మధ్య దూరం పెరిగింది. ఇది కాస్త సీఎం కేసీఆర్​ వర్సెస్​ గవర్నర్​ తమిళిసైగా అనే విధంగా మారింది. అసెంబ్లీ సమావేశాలు అనంతరం ఈ వివాదం మరింత ముదిరింది. ఈ ఏడాది బడ్జెట్​ సమావేశాలకు కూడా గవర్నర్​ నుంచి అనుమతి రాలేదని ప్రభుత్వ పెద్దలు ఆరోపించారు. 10రోజులు ముందే ఆమెకు లేఖ పంపించామని అయనప్పటికి ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. చివరికి ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎట్టకేలకు ఈ సమస్య పరిష్కారమై బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రారంభించారు.

గత ఏడాది జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశపెట్టి.. ఉభయసభల ఆమోదం అనంతరం రాజ్​భవన్​కు పంపింది. వాటిల్లో జీఎస్టీ సవరణ బిల్లుకు మాత్రమే ఆమోదముద్ర వేసిన గవర్నర్​.. మిగతా 7 బిల్లులను అప్పటి నుంచి పెండింగ్​లోనే ఉంచారు. దీంతో రాజ్​భవన్, ప్రగతిభవన్ మధ్య వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఆ తరువాత మరికొని బిల్లులకు గవర్నర్​ ఆమోదం తెలిపారు.

Governor pending bills dispute: తాజాగా ఇవాళ పెండింగ్​ బిల్లులపై గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు మూడు బిల్లులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా అందులో ఒక బిల్లును తిరస్కరిస్తూ వెనక్కి పంపిన గవర్నర్.. మిగిలిన రెండు బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరారు.

ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం చేస్తున్నారు: ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమాలకు తనను దూరం చేస్తున్నారని అనేక సందర్భాల్లో తమిళిసై ఆరోపించారు. తాజాగా హైదరాబాద్​లో అంబేడ్కర్ 125 విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తనకు ఎలాంటి పిలుపు అందలేదని అన్నారు. ఆహ్వానం రానందున.. రాజ్ భవన్‌లోనే నివాళులు అర్పించాల్సి వచ్చిందన్నారు. ​ప్రభుత్వ పెద్దలు మాత్రం రాజకీయ నాయకురాలుగా గవర్నర్​ వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.

ఇవీ చదవండి:

Ambedkar statue: అంబేడ్కర్​ విగ్రహావిష్కరణకు రమ్మని ఆహ్వానం రాలేదు: తమిళిసై

"రేవంత్​రెడ్డి బాగా మాట్లాడతారు.. ప్రతిరోజు ఆయన ప్రసంగాలు చూస్తాను'

YS Sharmila : లోటస్​ పాండ్ వద్ద ఉద్రిక్తత.. పోలీసులపై చేయి చేసుకున్న షర్మిల

Last Updated :Apr 24, 2023, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.