ETV Bharat / state

కొనసాగుతున్న గణేశ్‌ నిమజ్జనం.. వ్యర్థాలు తొలగిస్తున్న జీహెచ్‌ఎంసీ

author img

By

Published : Sep 10, 2022, 12:11 PM IST

హుస్సేన్‌ సాగర్‌ వద్ద కొనసాగుతున్న గణేశ్‌ నిమజ్జనం కొనసాగుతోంది. వినాయక సాగర్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను జీహెచ్‌ఎంసీ ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగిస్తోంది.

GHMC workers cleaning wastage at Hussainsagar Hyderabad
కొనసాగుతున్న గణేశ్‌ నిమజ్జనం

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం కొనసాగుతోంది. హుస్సేన్‌ సాగర్‌లో విగ్రహాలను ఒక్కొక్కటిగా నిమజ్జనం చేస్తున్నారు. ట్యాంక్‌బండ్‌పై వాహనాలను అనుమతించకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపిస్తున్నారు. వినాయక సాగర్‌లో ఎప్పటికప్పుడు పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తున్నారు. ఓ వైపు నిమజ్జనం ప్రక్రియ కొనసాగుతుండగానే.... జీహెచ్​ఎంసీ సిబ్బంది పారిశుద్ధ్యం పనులు చేపట్టారు. రహదారులపై వ్యర్థాలు, చెత్తను శుభ్రం చేస్తున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.