ETV Bharat / state

నాయకత్వం మారితే తెరాసలో చేరుతా: కొండా విశ్వేశ్వర్​ రెడ్డి

author img

By

Published : Mar 28, 2021, 5:36 PM IST

Updated : Mar 28, 2021, 9:06 PM IST

konda vishweshwar reddy
కొండా విశ్వేశ్వర్​ రెడ్డి

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలవాలని సమయం కోరినట్లు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి తెలిపారు. నాయకత్వం మారితే తెరాసలో చేరే అవకాశం ఉందన్నారు.

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాయకత్వం మారితే తెరాసలో చేరే అవకాశం ఉందన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలవాలని సమయం కోరినట్లు తెలిపారు. ఈటల రాజేందర్‌, హరీశ్​ అంటే తనకు అభిమానమని పేర్కొన్నారు.

ఈటల బయటకు వస్తా అంటున్నారని... కానీ రావడం లేదు.. కావాలనే ఇలా డ్రామా జరుగుతోందా లేక నిజంగానే జరుగుతోందా అన్న విషయం తెలుసుకోడానికే తాను సమయం కోరినట్లు వివరించారు. హరీశ్​ రావు ప్రజల మనిషి అని.. ఎక్కువగా మాట్లాడరని, ఎక్కువగా వింటారని అన్నారు. రాష్ట్రంలో పార్టీలు ఎక్కువై.. ఓట్లు చీలిపోతే.. తనకు మేలు జరుగుతుందని కేసీఆర్​ అంచనా వేస్తున్నారని చెప్పారు.

కొండా విశ్వేశ్వర్​ రెడ్డి

ఇదీ చదవండి: ప్రారంభమైన మల్లన్న జాతర.. బోనాలు సమర్పించిన గ్రామస్థులు

Last Updated :Mar 28, 2021, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.