ETV Bharat / state

Food Processing Industries in Telangana : ఊరూరా ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం

author img

By

Published : Aug 15, 2023, 2:10 PM IST

Food Processing Industries in Telangana : తెలంగాణలో ఊరూరా సూక్ష్మ, చిన్న తరహా ఆహార శుద్ధి పరిశ్రమలు స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ద్వారా వీటిని నెలకొల్పి మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

Rural Poverty Alleviation Organization
Food Processing Industries Establishment In Telangana

Food Processing Industries in Telangana : తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. అందుకు తగిన విధంగా ప్రోత్సాహం, ప్రోత్సాహకాలు అందజేస్తుంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలను ప్రోత్సహిస్తూ.. వారు స్వయం ఉపాధి పొందాలని ఎప్పటికప్పుడు ప్రణాళికలను రూపొందిస్తోంది. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా సూక్ష్మ, చిన్న తరహా ఆహారశుద్ధి పరిశ్రమలు స్థాపించాలని నిర్ణయించింది. వీటిని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్​) ద్వారా నెలకొల్పి.. డ్వాక్రా మహిళలను ప్రోత్సహించాలని భావిస్తోంది.

అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రతిపాదనలో ప్రభుత్వం జిల్లాకో ఆహారశుద్ధి ప్రత్యేక మండలిని ఏర్పాటు చేయనుంది. పారిశ్రామిక సంస్థల ద్వారా జిల్లాల్లోని గ్రామాల్లో పంటలు, కూరగాయలు, పండ్ల తోటల ఉత్పత్తుల ఆధారంగా ఆహారశుద్ధి పరిశ్రమలు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,35,364 మహిళా సంఘాల్లో 45,60,518 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘాల్లో గ్రామీణ మహిళలకు ఉపాధిని కల్పించేందుకు ఆహార శుద్ధి పరిశ్రమలు స్థాపించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

ఫ్లిప్​కార్ట్​తో సెర్ప్ ఒప్పందం.. ఇకపై ఆన్​లైన్​లో ఆ వస్తువులు

Rural Poverty Alleviation Organization : అందుకు వ్యవసాయ, ఉద్యాన, పరిశ్రమల శాఖలను సమన్వయం చేసుకుని.. తగిన నివేదికను రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయానికి సంబంధించిన సమగ్ర నివేదిక రూపొందించి ఇవ్వాలని.. ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖకు ఆదేశాలు పంపింది. అయితే ఇప్పటికే దాదాపు 500కు పైగా మహిళా సంఘాలు ఆహారశుద్ధి కుటీర పరిశ్రమలను నిర్వహిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. తాజాగా ఇప్పుడు తీసుకువస్తున్న పరిశ్రమల ఆలోచనతో.. గ్రామాల్లో మరింత మందికి మహిళలకు ఉపాధి మెరుగవుతుందని ప్రభుత్వం అంచనా.

మండల కేంద్రాల్లో శిక్షణ : ఈ ఆహారశుద్ధి, పరిశ్రమల నిర్వహణపై మొదట సంఘాల సభ్యులకు మండల కేంద్రాల్లో శిక్షణ.. పారిశ్రామిక సంస్థల ద్వారా వారికి మెలకువలు నేర్పించనున్నారు. అయితే వీటి ఏర్పాటుకు ప్రభుత్వం బ్యాంకు రుణ సదుపాయం కల్పించనుంది. పరిశ్రమల స్థాపన అనంతరం.. ఆయా ప్రాంతాల చారిత్రక నేపథ్యం, పర్యాటక స్థలాలు తదితరాల ప్రాతిపదికన వీటికి బ్రాండ్​ను ఖరారు చేయనున్నారు. ఉత్పత్తుల కొనుగోళ్లు, ఎగుమతులకు అవసరమైన సహకారం అందించనున్నారు.

Modern Anganwadi Center in Medak : ప్రైవేటుకి దీటుగా కనువిందు చేస్తున్న అంగన్వాడీ కేంద్రం

జిల్లాల వారీగా నెలకొల్పనున్న పరిశ్రమలు : వరంగల్​ : మిర్చి, పసుపు; మెదక్‌: సెనగలు, సీతాఫలాలు, ఉల్లిగడ్డ; మహబూబ్‌నగర్‌: తృణధాన్యాలు, సీతాఫలాలు; నిజామాబాద్‌: పసుపు, మొక్కజొన్న; వికారాబాద్‌: తృణధాన్యాలు, కూరగాయలు; భద్రాద్రి: మిర్చి, జీడిపప్పు; సూర్యాపేట: కూరగాయలు, పాలు; కరీంనగర్‌: కూరగాయలు; గద్వాల: వేరుసెనగ; మహబూబాబాద్‌: మిర్చి, పండ్లు; హనుమకొండ: పప్పులు, తృణధాన్యాలు; ములుగు: మిర్చి; సిద్దిపేట: కూరగాయలు, మొక్కజొన్న, పండ్లు; ఆసిఫాబాద్‌: పప్పుధాన్యాలు; పెద్దపల్లి: కూరగాయలు; నల్గొండ: బత్తాయి; మేడ్చల్‌ మల్కాజిగిరి: ద్రాక్ష; యాదాద్రి: పాడి ఉత్పత్తులు; భూపాలపల్లి: కూరగాయలు; జగిత్యాల: మామిడి; రంగారెడ్డి: పండ్లు, కూరగాయలు; ఖమ్మం: మిర్చి, పండ్లు, కూరగాయలు; సిరిసిల్ల; చేపలు ; కామారెడ్డి: మొక్కజొన్న, చెరకు; నాగర్‌కర్నూల్‌: మామిడి, వేరుశనగ; నారాయణపేట: సేంద్రియ పప్పు; మంచిర్యాల: కూరగాయలు, పండ్లు; ఆదిలాబాద్‌: సోయాబీన్‌, సీతాఫలాలు, కూరగాయలు; వనపర్తి: వేరుసెనగ; జనగామ: బంగాళాదుంపసంగారెడ్డి: అల్లం.

Rythu Runamafi 2023 : రూ. లక్షలోపు రుణమాఫీ పూర్తి చేసిన ప్రభుత్వం

Pradhan Mantri Suraksha Bima Yojana PMSBY : రూ.20లకే రూ.2లక్షల ప్రమాద బీమా.. చేరండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.