ETV Bharat / state

శంకుస్థాపన వేళ కేటీఆర్​, హరీశ్​తో సెల్ఫీలు

author img

By

Published : Jun 27, 2019, 3:35 PM IST

Updated : Jun 27, 2019, 5:12 PM IST

నూతన సచివాలయ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​, మాజీ మంత్రి హరీశ్​రావులతో సెల్ఫీలు దిగేందుకు ఉద్యోగులు పోటీ పడ్డారు. స్వయంగా కేటీఆరే కొందరి చరవాణిలు తీసుకుని స్వీయచిత్రాలు దిగడం విశేషం. ఈ సందర్భంగా కేటీఆర్​ సరదాగా ఉద్యోగులతో ముచ్చటించారు.

కేటీఆర్​ సెల్ఫీలు

నూతన సచివాలయ భవన శంకుస్థాపన కార్యక్రమం స్వీయ చిత్రాలకు వేదికైంది. కార్యక్రమానికి వచ్చిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​తో సెల్ఫీలు దిగేందుకు ఉద్యోగులు పోటీ పడ్డారు. మాజీ మంత్రి హరీశ్​రావుతోనూ కొందరు స్వీయచిత్రాలు దిగారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం కూడా కొందరు సెల్ఫీలు దిగుతూ కనిపించారు. స్వయంగా కేటీఆరే కొందరు పారిశుద్ధ్య కార్మికుల ఫోన్లు తీసుకుని సెల్ఫీలు తీశారు. ఈ సందర్భంగా కేటీఆర్​ చలోక్తులతో అందరినీ నవ్వించారు.

కేటీఆర్​తో సెల్ఫీలకు పోటీ పడుతున్న ఉద్యోగులు

ఇదీ చూడండి : చెత్తతో కూర్చీలు, సోఫా... దానమిచ్చేస్తారు

Last Updated : Jun 27, 2019, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.