ETV Bharat / state

పోలీసులు సమాజ సేవకులుగా పనిచేయాలి: డీజీపీ మహేందర్‌రెడ్డి

author img

By

Published : Oct 8, 2020, 1:16 PM IST

DGP Mahender Reddy spoke about police duty
పోలీసులు సమాజ సేవకులుగా పనిచేయాలి: డీజీపీ మహేందర్‌రెడ్డి

పోలీస్​ బాస్​ డీజీపీ మహేందర్​రెడ్డి... పోలీసులకు కొన్ని సూచనలు చేశారు. ప్రజల భద్రత, సంక్షేమమే ధ్యేయంగా విధులు నిర్వహించాలని అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు.

పోలీసులు సమాజ సేవకులుగా పనిచేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల భద్రత, సంక్షేమమే ధ్యేయంగా విధులు నిర్వహించాలని సూచించారు.

శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో పోలీస్‌శాఖ పనితీరు ఎంతో దోహదపడుతోందని వివరించారు. ఠాణాలకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదతో మెలగాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నేరస్థులను త్వరగా పట్టుకుంటున్నామని స్పష్టం చేశారు. పోలీస్‌శాఖలోని ప్రతిఒక్కరూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.