ETV Bharat / state

అందరికీ అందుబాటులో మొబైల్​ వ్యాక్సిన్​ కేంద్రం

author img

By

Published : Jun 24, 2021, 9:49 PM IST

cc
cs somesh kumar visit mobile covid vaccination center

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 96 లక్షల డోసుల వ్యాక్సిన్లు ఇచ్చామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ అన్నారు. ఒకట్రెండు రోజుల్లో కోటి డోసులు పూర్తవుతుందని స్పష్టం చేశారు. మోండా మార్కెట్​లో ఏర్పాటుచేసిన మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

సకాలంలో వ్యాక్సిన్ చేయించుకోలేని వారికి మొబైల్​ వ్యాక్సిన్​ కేంద్రాల ద్వారా టీకా వేస్తున్నట్లు సీఎస్​ సోమేశ్​ కుమార్​ తెలిపారు. హైదరాబాద్​లో 30 మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలను ఎంచుకుని ప్రత్యేకంగా వ్యాక్సిన్లు అందిస్తున్నట్లు తెలిపారు. మోండా మార్కెట్​లో కూరగాయలు విక్రయించేవారిలో ఇప్పటి వరకు టీకా వేసుకోని వారికి అవగాహన కల్పించి వ్యాక్సిన్ ఇప్పిస్తున్నట్లు వెల్లడించారు.

గ్రేటర్ హైదరాబాద్​లో దాదాపు 100 కేంద్రాల్లో వ్యాక్సిన్ అందిస్తున్నామని సీఎస్​ తెలిపారు. వీలైనంత త్వరగా అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషిచేస్తోందని వివరించారు. వ్యాక్సిన్ పంపిణీ గురించి ఎప్పటికప్పడు సీఎం కేసీఆర్​ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని సీఎస్​ వెల్లడించారు.

cc
cc

ఇదీ చూడండి: KTR: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.