ETV Bharat / state

CPM Central Committee Meetings: 'మహాసభలకు 2 నెలల ముందు డ్రాఫ్ట్ విడుదల చేస్తాం'

author img

By

Published : Jan 7, 2022, 12:54 PM IST

CPM Central Committee Meetings
సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు

CPM Central Committee Meetings: పార్టీ 23వ మహాసభల ముసాయిదా తీర్మానం రూపొందించి.. మహాసభలకు 2 నెలల ముందు డ్రాఫ్ట్ విడుదల చేస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. హైదరాబాద్​లో మూడు రోజులు పాటు కేంద్ర కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

CPM Central Committee Meetings: కేంద్ర కమిటీ సమావేశాల్లో పార్టీ 23వ మహాసభల ముసాయిదా తీర్మానం రూపొందిస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. హైదరాబాద్​లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్​, ప్రాంతీయ పార్టీలతో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు వెల్లడించారు.

''జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కేంద్ర కమిటీ సమావేశాల్లో చర్చిస్తాం. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై.. ప్రణాళికలు రూపొందిస్తాం. పార్టీ 23వ మహాసభల ముసాయిదా తీర్మానం రూపొందించి... మహాసభలకు 2 నెలల ముందు డ్రాఫ్ట్ విడుదల చేస్తాం. సభ్యులు ముసాయిదా తీర్మానంపై సవరణలు పంపొచ్చు. ఏప్రిల్‌లో కేరళలో పార్టీ అఖిల భారత మహాసభలు నిర్వహించనున్నాం.''

- సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, త్రిపుర మాజీ సీఎం మానిక్‌ సర్కార్‌, ప్రకాష్ కారాట్‌, బృందా కారాట్, బిమన్ బసు, రామచంద్రన్ పిళ్ళై, సుభాషిణి అలీ, బీవీ రాఘవులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు

ఇదీ చూడండి: 'వనమా రాఘవను కఠినంగా శిక్షించాలి.. ఆయన తండ్రి రాజీనామా చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.