ETV Bharat / state

corona attack youth: యువతపై కరోనా పంజా.. 90 వేలకు పైగా బాధితులు

author img

By

Published : Oct 28, 2021, 5:27 AM IST

రాష్ట్రంలో యువతపై కరోనా పంజా విసిరింది. వైరస్​ సోకిన బాధితుల్లో 90 వేలమంది యువతే ఉన్నారు. అందులోనూ పదేళ్లలోపు పిల్లలు 19 వేలదాకా ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ నివేదిక వెల్లడించింది. తాజాగా వయసుల వారీగా కరోనా బాధితుల నివేదికను రూపొందించింది.

corona attack ninety thousand youth in Telangana
యువతపై కరోనా పంజా

రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా బాధితుల్లో 20 ఏళ్లలోపు యువకులు 90,561 మంది ఉన్నారు. పదేళ్లలోపు వయసున్న 19,445 మంది పిల్లలకు కొవిడ్‌ సోకింది. వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వయసుల వారీగా కరోనా బాధితుల నివేదికను రూపొందించింది. మొత్తం నమోదైన కేసుల్లో 61.4 శాతం మంది పురుషులు కాగా.. 38.6 శాతం మంది మహిళలు ఉన్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. 31-40 ఏళ్ల బాధితులు 21.8 శాతం మంది. అందులో 14.3 శాతం మంది పురుషులు, 7.5 శాతం మంది మహిళలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే.. 41-50 ఏళ్ల మధ్య వయస్కులు 17.5 శాతం, 51-60 ఏళ్ల వారు 14.4, 61-70 ఏళ్ల మధ్యవయసు వారు 7.7, 71-80 ఏళ్ల వారు 2.7, 81 ఏళ్లు.. ఆ పై వయసు ఉన్న వారు 0.7 శాతం మంది మహమ్మారి బారినపడినట్లు వైద్య శాఖ నివేదికలో వెల్లడించింది. కొవిడ్‌తో మరణించిన వారిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 55.69 శాతం మంది ఉన్నారు.

కొత్తగా 186 కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా 186 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,70,829కి పెరిగింది. మహమ్మారితో ఒకరు కన్నుమూశారు. ఇప్పటి వరకు 3,951 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,164 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 41,392 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 2,74,30,113కు పెరిగింది. మరో 1,647 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది.


ఇదీ చూడండి:

Covid cases in India: దేశంలో కొత్తగా 13,451 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.