ETV Bharat / state

పాత జిల్లాలకు తిరిగి బదిలీ అయిన కలెక్టర్లు

author img

By

Published : Nov 14, 2020, 7:29 AM IST

పాత జిల్లాలకు తిరిగి బదిలీ అయిన కలెక్టర్లు
పాత జిల్లాలకు తిరిగి బదిలీ అయిన కలెక్టర్లు

దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా బదిలీ అయిన కలెక్టర్లు తిరిగి తమ పాత జిల్లాలకు వెళ్లారు. సిద్దిపేట కలెక్టర్‌గా వెంకట్రామి రెడ్డిని మళ్లీ నియమించారు. మెదక్ కలెక్టర్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో బదిలీ అయిన కలెక్టర్లు తిరిగి పాత జిల్లాలకు వెళ్లారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల బదిలీలు చేపట్టింది. సిద్దిపేట కలెక్టర్‌గా వెంకట్రామి రెడ్డిని మళ్లీ నియమించింది. మెదక్ కలెక్టర్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. మంచిర్యాల కలెక్టర్‌గా భారతి హోళికేరిని బదిలీ చేసిన ప్రభుత్వం.. పెద్దపల్లి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.

సంగారెడ్డి కలెక్టర్‌గా హనుమంతరావు తిరిగి వెళ్లనున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుపై బదిలీ వేటు పడింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌గా హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి: సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఆర్డినెన్స్​

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.