ETV Bharat / state

రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించిన సీఎం రేవంత్​, భట్టి

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2023, 3:07 PM IST

Updated : Dec 26, 2023, 5:29 PM IST

CM Revanth Reddy and Bhatti Vikramarka Meet PM Modi : పెండింగ్​లో ఉన్న విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై సీఎం రేవంత్​ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించారు. ఈ సమావేశం దాదాపు గంట సేపు జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి, మోదీని కలవడం ఇదే తొలిసారి.

CM Revanth Reddy Delhi Tour
CM Revanth Reddy Bhatti Vikramarka Meet PM Modi

CM Revanth Reddy and Bhatti Vikramarka Meet PM Modi : సీఎం రేవంత్​ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇరువురు కలిసి దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్యమంత్రి హోదాలో మోదీని కలవడం ఇదే తొలిసారి. మధ్యాహ్నం దిల్లీ చేరుకున్న ఇరువురు నేతలు 4 గంటల సమయంలో ప్రధానిని కలిశారు. సుమారు గంటపాటు రాష్ట్రానికి చెందిన కీలక అంశాలపై మోదీతో చర్చించారు.

Revanth Reddy Meet PM Modi : రాష్ట్రంలో పెండింగ్​లో ఉన్న విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై చర్చిస్తున్నారు. ఇందులో ప్రధానంగా పాలమూరు - రంగారెడ్డి, ఆర్​ఆర్​ఆర్, ప్రాజెక్ట్​లకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల​పై చర్చిస్తున్నారని తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో ఎటువంటి గొడవలు, బేషజాలకు పోకుండా సఖ్యతతో మెలగాలని సీఎం రేవంత్​రెడ్డి ఇటీవలే అసెంబ్లీ వేదికగా తెలిపారు.

నేడు దిల్లీకి సీఎం రేవంత్ ​రెడ్డి, భట్టి విక్రమార్క - సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ

CM Revanth Reddy Delhi Tour : ప్రధాని నరేంద్ర మోదీ(CM Revanth Reddy Meet PM Narendra Modi)తో రేవంత్​ రెడ్డి సమావేశం ముగిసిన అనంతరం​ రాబోయే పార్లమెంట్ ఎన్నికల కార్యాచరణపైనా కాంగ్రెస్‌ పెద్దలను కలవనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో 12కు తగ్గకుండా ఎంపీలు గెలిచేందుకు అవసరమైన కార్యాచరణ, ప్రణాళికలతో ముందుకు వెళ్లేందుకు రాష్ట్ర కాంగ్రెస్​ నాయకత్వం సమాయత్తం అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే మార్పు, కొత్తగా ఇంఛార్జి బాధ్యతలు దీపాదాస్‌ మున్సీకి అప్పగించాలని తదితర అంశాలపై సమావేశం జరుగుతుందని సమాచారం.

సీఎం రేవంత్​కు స్వల్ప అస్వస్థత - కరోనా పరీక్ష చేయనున్న వైద్యులు

CM Revanth Reddy Meets Congress Senior Leaders in Delhi : నామినేటెడ్ పోస్టుల కేటాయింపుపై దిల్లీలో కాంగ్రెస్​ అగ్ర నాయకులతో రేవంత్​రెడ్డి, భట్టి చర్చించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress) అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో కష్టపడి పని చేసిన నాయకులు అంతా నామినేటెడ్‌ పోస్టుల కోసం వేచి చూస్తున్నారు. దీంతో యాభైకి పైగా నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేయాల్సినవి ఉంది. పార్టీ కోసం పని చేసిన వారితో పాటు టికెట్లు త్యాగం చేసిన నేతలకు కూడా పదవులు ఇచ్చేందుకు కొన్నిరోజులుగా పార్టీలో అంతర్గతంగా కసరత్తు జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఫాక్స్​కాన్ ప్రతినిధులతో సీఎం భేటీ - 'స్నేహ పూర్వకంగా ఉండే విధానం అవలంభిస్తాం'

Last Updated : Dec 26, 2023, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.