ETV Bharat / state

మిమ్మల్ని ఇంటికి చేర్చే బాధ్యత మాది: కేసీఆర్​

author img

By

Published : May 22, 2020, 12:05 AM IST

cm kcr on migrants
మిమ్మల్ని ఇంటికి చేర్చే బాధ్యత మాది: కేసీఆర్​

ఏ ఒక్క వలస కార్మికుడు కాలినడకన సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిన దుస్థితి రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ పేర్కొన్నారు. కార్మికులు వారి సొంత ప్రాంతాలకు వెళ్లడానికి రైలు, బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని సీఎస్​కు సూచించారు.

వలస కార్మికులు సొంత ప్రాంతానికి వెళ్లడానికి రైళ్లు సమకూర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ పేర్కొన్నారు. కార్మికుల కోసం రైలు సౌకర్యం కల్పించాలని... రైలు వసతి లేని వారిని బస్సుల ద్వారా తరలించాలని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.

కార్మికులెవరు నడిచి పోవాలనే ఆలోచన చేయవద్దని కోరిన ముఖ్యమంత్రి... వారిని సొంత ప్రాంతాలను చేర్చే బాధ్యత పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

ఇవీ చూడండి:అక్టోబర్‌లోగా ప్యాకేజీ-9 ద్వారా సిరిసిల్ల జిల్లాకు సాగునీరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.