ETV Bharat / state

CM KCR Mumbai Tour : 'సరైన సమయంలో గళం విప్పారు'.. సీఎం కేసీఆర్​కు ఉద్దవ్ ఠాక్రే ఫోన్

author img

By

Published : Feb 16, 2022, 12:01 PM IST

Updated : Feb 16, 2022, 2:47 PM IST

CM KCR Mumbai Tour: దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్రంపై యుద్ధం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు మద్దతు పెరుగుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే... సీఎం కేసీఆర్​కు ఫోన్‌చేసి ముంబయికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న కేసీఆర్‌ ముంబయి వెళ్లనున్నారు.

kcr uddav
kcr uddav

CM KCR Mumbai Tour : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో సీఎం కేసీఆర్‌ ఈనెల 20న భేటీ కానున్నారు. భాజపా అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతూ దేశం కోసం కేసీఆర్‌ చేస్తున్న పోరాటానికి ఉద్ధవ్‌.. సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ మేరకు కేసీఆర్‌కు ఆయన బుధవారం ఫోన్‌ చేశారు. ముంబయి రావాలని.. తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని ఆహ్వానించారు.

సంపూర్ణ మద్దతు తెలిపిన ఉద్ధవ్

దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి మద్దతు పెరుగుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే... సీఎం కేసీఆర్​కు ఫోన్‌చేసి ముంబయికి ఆహ్వానించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 20న సమావేశం కానున్నారు. ఇప్పటికే దేవెగౌడ, మమతా బెనర్జీ కూడా ముఖ్యమంత్రికి ఫోన్లు చేసి సంఘీభావం ప్రకటించారు. దేశం కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి... ఉద్దవ్‌ ఠాక్రే సంపూర్ణ మద్దతు పలికారు. భాజపా విధానాలను ఎండగడుతూ.. సమాఖ్య న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి సంఘీభావం తెలిపారు. కేసీఆర్‌కు బుధవారం ఫోన్‌ చేసిన ఉద్ధవ్‌ఠాక్రే.... విభజన శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సరైన సమయంలో కేసీఆర్‌ గళం విప్పారని ఠాక్రే అభినందించారు.

భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు

రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు పోరాటం కొనసాగించాలని.. ఈ దిశగా ప్రజామద్దతు కూడగట్టాలని కేసీఆర్‌కు సూచించారు. తాము సంపూర్ణంగా మద్దతిస్తామని స్పష్టంచేశారు. ఈనెల 20న ముంబయి వచ్చి... తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని కేసీఆర్‌కు... ఉద్ధవ్‌ఠాక్రే విజ్ఞప్తి చేశారు. ఆ రోజు భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేద్దామని కోరారు. ఈ నేపథ్యంలో సీఎం ఈనెల 20న ముంబయికి వెళ్లనున్నారు. ఈ మేరకు సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘కేసీఆర్‌ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం"

-ఉద్ధవ్‌ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం

ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా రేవంత్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నేతల గృహనిర్బంధం

Last Updated : Feb 16, 2022, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.