ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర జీఎస్టీ అధికారుల అవగాహన సదస్సులు

author img

By

Published : Feb 26, 2020, 10:20 AM IST

CGST Awareness seminars At telanagana state wide
రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర జీఎస్టీ అధికారుల అవగాహన సదస్సులు

రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 7 వరకు అన్ని జిల్లాల్లో కేంద్ర జీఎస్టీ అధికారుల అవగాహన సదస్సులు జరగనున్నాయి. జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయడంలో వ్యాపార, వాణిజ్య సంస్థలకు ఎదురవుతున్న ఇబ్బందులు, తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు.

కొత్తగా మారిన విధానంలో జీఎస్టీ రిటర్న్​లు దాఖలు చేయడంలో వ్యాపార, వాణిజ్య సంస్థలకు ఎదురవుతున్న ఇబ్బందులు, సాంకేతిపరంగా వస్తోన్న అనుమానాలు వంటి అంశాలపై కేంద్ర జీఎస్టీ అధికారుల అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఇది వచ్చే నెల 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు.

కేంద్ర జీఎస్టీ చీఫ్​ కమిషనర్​ వాసా శేషగిరిరావు నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమాల్లో వివిధ వర్గాలకు చెందిన వ్యాపారస్తులు, వాణిజ్య, పారిశ్రామిక రంగ ప్రతినిధులు, కన్సల్టెంట్లు, ఆడిటర్లు పాల్గొనేట్లు ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

జీఎస్టీకి చెంది కొత్త రిటర్న్​ విధానం ఏలా ఉంటుంది.. వెబ్​సైట్​లో ఏలా అప్​లోడ్ చేయాలనే అంశాలపై వివరిస్తారని కేంద్ర జీఎస్టీ అధికారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర జీఎస్టీ అధికారుల అవగాహన సదస్సులు

ఇదీ చూడండి: కేసీఆర్​ ఆతిథ్యానికి ట్రంప్​ ఫిదా​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.