ETV Bharat / state

కేసీఆర్..నీ భాష మార్చుకో....: కిషన్​రెడ్డి

author img

By

Published : May 19, 2020, 12:07 PM IST

Updated : May 19, 2020, 12:16 PM IST

సీఎం కేసీఆర్​పై కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఘాటుగా విమర్శలు గుప్పించారు. కేంద్రాన్ని విమర్శించడం సీఎం స్థాయికి తగిన భాష కాదని హితవు పలికారు.

CENTER MINISTER KISHAN REDDY Criticised cm kcr
ముఖ్యమంత్రి స్థాయికి తగిన భాష కాదు: కిషన్​రెడ్డి

కేంద్రాన్ని విమర్శించడం సీఎం స్థాయికి తగిన భాష కాదని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. తాము తప్ప ఏ పార్టీ ఉండకూడదనే సంకుచిత ధోరణిలో ఉన్నారని విమర్శించారు. కేసీఆర్‌ నియంతృత్వ పాలన చేస్తున్నారని ఆరోపించారు. పురపాలికలు, గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.

గ్రామ సర్పంచ్‌లు బిచ్చగాళ్లా... సీఎం కేసీఆర్‌ చెప్పాలని కిషన్​రెడ్డి నిలదీశారు. ప్రభుత్వం చెప్పిన పంటలు వేయకపోతే.. రైతు బంధు వర్తించదన్నారు.. ఈ విధంగా చెప్పడం రైతుల నెత్తిపై కత్తి పెట్టినట్లు కాదా? అని మండిపడ్డారు. ఎవరి నెత్తిన కత్తి పెట్టలేదు.. అలాంటి ఆలోచనే కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. దగా, అంకెల గారడీ ఎవరు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రాలు, దేశ భవిష్యత్తు బాగుండాలని సంస్కరణలు తెచ్చారని వెల్లడించారు. టీమ్‌ ఇండియాగా కలిసి పనిచేయాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.

కేసీఆర్..నీ భాష మార్చుకో....: కిషన్​రెడ్డి

గ్రామ సర్పంచ్‌లు బిచ్చగాళ్లా సీఎం కేసీఆర్‌ చెప్పాలి. కేంద్రాన్ని విమర్శించడం సీఎం స్థాయికి తగిన భాష కాదు. తాము తప్ప ఏ పార్టీ ఉండకూడదనే సంకుచిత ధోరణిలో ఉన్నారు. కేసీఆర్‌ నియంతృత్వ పాలన చేస్తున్నారు. పురపాలికలు, గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలి...... కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

ఇవీ చూడండి: 'బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం'

Last Updated : May 19, 2020, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.