ETV Bharat / state

కేంద్రం తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేసిన బీఆర్ఎస్ దళం

author img

By

Published : Dec 23, 2022, 9:27 PM IST

BRS Protests Across Telangana : ఉపాధి హామీ నిధులను తిరిగివ్వాలన్న కేంద్రం నోటీసులను నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లో పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. కేంద్రం రైతు వ్యతిరేఖ విధానాలు అవలంభిస్తుందని ఆరోపిస్తూ ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

BRS
BRS

ఉపాధి హామీ నిధులపై కేంద్ర వైఖరి పట్ల.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు

BRS Protests Across Telangana: రాష్ట్రంలో రైతులు ధాన్యం ఆరబోసుకోవడానికి ప్రభుత్వం రూ.151 కోట్ల ఉపాధి హామీ నిధులతో కల్లాలు నిర్మించింది. నిబంధనలకు విరుద్ధంగా వినియోగించిన నిధులను.. తిరిగి ఇవ్వాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరింది. బీజేపీ సర్కార్‌ రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ.. బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. నిర్మల్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకూ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీర్యాలీ చేపట్టారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. వడ్లకుప్పలు రోడ్డుపై పోసి ఆందోళన నిర్వహించారు. నిజామాబాద్‌లో నిర్వహించిన ఆందోళనలో ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గణేశ్‌ గుప్తా పాల్గొన్నారు. రైతు కల్లాల విషయంలో కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తావద్ద పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళనలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు.

దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తాం: నారాయణపేటలో బీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. కార్పొరేట్‌ శక్తులకు వ్యవసాయాన్ని ధారాదత్తం చేయద్దని నినాదాలు చేశారు. వనపర్తిలోని రాజీవ్‌కూడలి వద్ద నిర్వహించిన ఆందోళనలో భారీగా పార్టీశ్రేణులు పాల్గొన్నారు. కేంద్రం తన నోటీసులను వెనక్కి తీసుకోకుంటే దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఖమ్మంలో ఎమ్మెల్సీ తాత మధు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకనే .. కేంద్రం కుట్రసు చేస్తోందని ఎమ్మెల్సీ ఆరోపించారు.

స్వచ్ఛందంగా కదిలివచ్చిన రైతులు: జగిత్యాలలో నిర్వహించిన నిరసనకు ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సంజయ్‌కుమార్‌లు హాజరయ్యారు. హన్మకొండలో బీఆర్ఎస్ నాయకులు జొన్నకంకులతో ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ నిరసనలో పాల్గొన్నారు. మేడ్చల్‌లో ఎమ్మెల్సీ శంబీపూర్‌రాజు ఆధ్వర్యంలో ఆందోళనల నిర్వహించారు. బీఆర్ఎస్ పిలుపుతో పెద్దఎత్తున రైతులు స్వచ్ఛందంగా కదిలివచ్చారు. కేంద్రం తీరుకు నిరసనగా పార్టీశ్రేణులతో కలిసి నినదించారు.

ఇవీ చదవండి: సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటాం: ఎమ్మెల్సీ కవిత

ఆర్మీ ట్రక్కుకు ఘోర ప్రమాదం.. 16 మంది సైనికులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.