ETV Bharat / state

Raghunandan rao: 'హుజూరాబాద్​ ఎన్నికల కోసమే సభను రెండు రోజులు పొడిగించారు'

author img

By

Published : Oct 9, 2021, 6:56 PM IST

Raghunandan rao: 'హుజూరాబాద్​ ఎన్నికల కోసమే సభను రెండు రోజులు పొడిగించారు'
Raghunandan rao: 'హుజూరాబాద్​ ఎన్నికల కోసమే సభను రెండు రోజులు పొడిగించారు'

హుజూరాబాద్​ ఎన్నికల కోసమే శాసనసభను రెండు రోజులు పొడిగించారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు ఆరోపించారు. సభా హక్కులను ముఖ్యమంత్రి కేసీఆర్​ ఉల్లంఘించారని ఆయన విమర్శించారు.

'హుజూరాబాద్​ ఎన్నికల కోసమే సభను రెండు రోజులు పొడిగించారు'

కులగణన చేసి పబ్లిక్​ డొమైన్​లో పెట్టకుండా.. కులాల గురించి కేంద్రాన్ని అడగడం చాలా బాధాకరమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. కేంద్రమే అప్పుల్లో ఉందన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎఫ్​ఆర్​బీఎం పెంచమని ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. యాదాద్రి థర్మల్​ ప్లాంట్​కు 15రోజుల్లోనే అనుమతి ఇచ్చిందని కేంద్రాన్ని పొగిడిన కేసీఆర్​.. ఇప్పుడు ఎందుకు కేంద్రంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వివిధ పథకాలకు కేంద్రం ఇచ్చే నిధులు ఎన్ని శాసనసభలో మంత్రి ఎర్రబెల్లిని ప్రశ్నించామని వెల్లడించారు. కేంద్రం నిధులే లేకపోతే పంచాయతీల పరిస్థితి ఏంటో ఆలోచించాలన్నారు.

శాసనసభలో సీఎం కేసీఆర్​ తనపై వ్యంగ్యంగా మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. హుజూరాబాద్​ ఎన్నికల కోసమే శాసనసభను రెండు రోజులు పొడిగించారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారం కోసం సభా సమయాన్ని దుర్వినియోగం చేశారన్నారు. సభా హక్కులను ముఖ్యమంత్రి కేసీఆర్​ ఉల్లంఘించారని ఆయన విమర్శించారు.

హుజూరాబాద్​ ఎన్నికల కోసం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, వివిధ పథకాలపై సమీక్ష, దళితబంధుపై చర్చ అంటూ సభా సమయాన్ని దుర్వినియోగం చేశారు. ధరణి, పోడుభూములు, దళితుల సమస్యలు, ఏడీసీడీ వర్గీకరణల మీద చర్చ లేదు. హుజూరాబాద్​ ఎన్నికల కంటే ముందు చెప్పిన 50 వేల ఉద్యోగాలు లేవు. హుజూరాబాద్​ ఎన్నికల ప్రచారం కోసం సభను వక్రీకరించారు. -రఘునందన్​రావు, దుబ్బాక ఎమ్మెల్యే

ఇదీ చదవండి: CM KCR Review on Podu Lands: పోడు భూములపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.