ETV Bharat / state

R. krishnaiah: విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి తాళం వేస్తాం..!

author img

By

Published : Jun 14, 2021, 4:58 PM IST

విద్యావాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య విద్యావాలంటీర్లతో కలిసి హైదరాబాద్​లోని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. 14 నెలల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

14 నెలల బకాయి వేతనాలు చెల్లించాలి: ఆర్. కృష్ణయ్య
14 నెలల బకాయి వేతనాలు చెల్లించాలి: ఆర్. కృష్ణయ్య

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేస్తూ... 14 నెలల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యావాలంటీర్లపై రాష్ట్ర ప్రభుత్వం వివక్షతను నిరసిస్తూ... లక్డీకపూల్​లోని రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లకుండా విద్యాశాఖ అధికారులు మొండి వైఖరి వహిస్తున్నారని కృష్ణయ్య ఆరోపించారు. కరోనా కారణంగా ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న 2 లక్షల 20 వేల మంది ఉపాధ్యాయులకు నెలకు రెండు 2వేల రూపాయలు, 25 కిలోల బియ్యం ఇస్తున్నట్లుగానే... 16 వేల విద్యా వాలంటీర్లకు కూడా సర్కారు సాయం చేయాలని డిమాండ్ చేశారు.

14 నెలలుగా జీతాలు చెల్లించలేదని... ఇప్పటికైనా విద్యావాలంటీర్ల సమస్యలను ముఖ్యమంత్రి గుర్తించి వారిని ఆదుకోవాలని కృష్మయ్య కోరారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నారని... కొందరు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆయన తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించకుంటే గతంలో రెండు వేల మందితో విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి తాళం వేసినట్లుగానే... మరోసారి చేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. ప్రతి ఏడాది రెన్యువల్ చేసే విధానానికి స్వస్తి పలకాలని తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ ఐకాస చైర్మన్ నీలం వెంకటేష్ డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: Petrol Price: హైదరాబాద్​లోనూ సెంచరీ దాటిన పెట్రోల్

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.