ETV Bharat / state

Banjarahills CI Bribe Case Updates : బంజారాహిల్స్ పోలీసుల వసూళ్ల పర్వంపై లోతుగా విచారణ.. ముడుపులు, కమీషన్లపై అనిశా ఆరా

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2023, 8:57 AM IST

Banjarahills CI Bribe Case
Banjarahills

Banjarahills CI Bribe Case Updates : బంజారాహిల్స్‌ ఠాణాలో విధులు నిర్వహిస్తున్న.. పోలీసుల అవినీతిపై ఏసీబీ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. రాక్‌పబ్‌ నిర్వాహకుల వద్ద నుంచి రూ.3 లక్షలు డిమాండ్‌ చేశారనే ఆరోపణలతో ఇప్పటికే అనిశా అధికారులు పోలీస్‌స్టేషన్‌ సీఐ నరేందర్‌, ఎస్‌ఐ నవీన్‌రెడ్డి, హోంగార్డు హరిని సుదీర్ఘంగా విచారించి వారిపై కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురిని సోమవారం విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.

Banjarahills CI Bribe Case Updates : బంజారాహిల్స్‌ పోలీసుల వసూళ్ల పర్వంపై అవినీతి నిరోధక శాఖ అధికారుల దర్యాప్తు ముమ్మరమైంది. రాక్‌పబ్‌ నిర్వాహకుల నుంచి రూ.3 లక్షలు డిమాండ్‌ చేశారనే ఆరోపణలతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు తీగ లాగితే డొంక కదిలింది. పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పబ్‌లు, మసాజ్‌ కేంద్రాల నుంచి ముడుపులు, సివిల్‌ తగాదాల్లో చేతులు మారుతున్న కమీషన్లపై అనిశా అధికారుల బృందం ఆరా తీసింది.

ACB Investigation in Banjarahills CI Bribe Case : కొందరు బాధితుల నుంచి పోలీసుల వ్యవహారం గురించి ఏసీబీ అధికారులు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. సేకరించిన ఆధారాలు, సమాచారం ఆధారంగా సీఐ నరేందర్‌ (Banjarahills CI Narender), ఎస్‌ఐ నవీన్‌రెడ్డి, హోంగార్డు హరిని మరింత లోతుగా ప్రశ్నించనున్నారు. రాక్‌పబ్‌ వ్యవహారంలో అనిశా బృందం ఇప్పటికే సీసీ కెమెరాల ఫుటేజ్‌ సేకరించారు. అర్ధరాత్రి సమయంలో పబ్‌ యజమానిని పోలీస్‌స్టేషన్‌కు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో తెలుసుకున్నారు.

TU VC Ravinder Caught by ACB Officials : ఏసీబీకి చిక్కిన తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్

నిర్వాహకులు నిర్దేశించిన సమయం ముగిసినప్పటికీ.. పట్టించుకోకుండా పబ్‌ తెరిచి ఉంచడాన్ని ఎస్‌ఐ నవీన్‌రెడ్డి గమనించి సీఐ నరేందర్‌కు చెప్పాడు. అయితే సీఐ ఆదేశాలతో పబ్‌ యజమానిని తీసుకువచ్చినట్టు నవీన్‌రెడ్డి ఏసీబీకి వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. నిబంధనల ప్రకారం పబ్‌ కొనసాగిస్తున్నా.. తమను బంజారాహిల్స్‌ పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వేధించారంటూ పబ్‌ నిర్వాహకులు అనిశాకు (ACB) వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది.

ACB Investigation Banjarahills Police : దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల నేపథ్యంలో పోలీసు అధికారులు చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నరేందర్‌, ఎస్‌ఐ నవీన్‌రెడ్డిపై అంతర్గత విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది. తద్వారా వచ్చే నివేదిక ఆధారంగా వారిపై వేటు పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో పలువురు పోలీసు అధికారులు బంజారాహిల్స్‌ సీఐ పోస్టింగ్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

అసలేం జరిగిదంటే : బంజారాహిల్స్​లోని రాక్‌పబ్ నిర్వాహక భాగస్వామి లక్ష్మణ్‌రావును.. మూడు నెలలకు రూ.4.5 లక్షలు మాములు ఇవ్వాలని సీఐ నరేందర్ డిమాండ్‌ చేశాడు. అందుకు అతను స్పందించకపోవడంతో కొద్ది రోజుల తర్వాత రూ.3 లక్షలు ఇవ్వాలని అడిగాడు. ఈ క్రమంలోనే సీఐ వద్ద హోంగార్డుగా పనిచేస్తున్న శ్రీహరి తనకు వ్యక్తిగతంగా రూ.10,000 ఇవ్వాలంటూ లక్ష్మణ్‌రావును డిమాండ్‌ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్పెక్టర్‌ ఆదేశాల మేరకు శ్రీహరి.. పబ్‌ నిర్వాహకుడికి పదేపదే వాట్సాప్‌ కాల్‌ చేసి మామూళ్ల కోసం వేధించడం మొదలుపెట్టాడు.

పంథా మార్చని ప్రభుత్వ అధికారులు.. ఏసీబీకి దొరికి జీవితం ఆగం

లక్ష్మణ్‌రావు నుంచి డబ్బులు చేతికి అందకపోవటంతో.. సీఐ నరేందర్ నేరుగా రంగంలోకి దిగాడు. ఎస్‌ఐ నవీన్‌రెడ్డితో పబ్‌లో తనిఖీలు చేయించి కేసులు నమోదు చేయించాడు. సెప్టెంబర్‌ 30న అర్ధరాత్రి ఇన్‌స్పెక్టర్‌ ఆదేశాల మేరకు పబ్‌ వద్దకు వచ్చిన ఎస్ఐ.. లక్ష్మణ్‌రావును బలవంతంగా పోలీసు కారులో ఎక్కించుకొని ఠాణాకు తరలించారు. అక్కడే కొద్ది గంటల పాటు ఆయనను కూర్చోబెట్టారు. ఇలా పోలీసులు.. తనను వేధింపులు, బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ లక్ష్మణ్‌రావు ఏసీబీ అధికారులను సంప్రదించడంతో ఈ వ్యవహారం బయటపడింది.

Education Employees Arrested in Bribing Case Telangana : పాఠశాల అనుమతి కోసం లంచం డిమాండ్.. ముగ్గురు విద్యాశాఖ అధికారులు అరెస్టు

ACB Raids at Marriguda MRO House : రూ.4.75 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తింపు.. మర్రిగూడ తహసీల్దార్​ అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.