ETV Bharat / state

Bandi Sanjay Reacted TDP Issue : 'చంద్రబాబు అమిత్​షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి ?'

author img

By

Published : Jun 4, 2023, 7:14 PM IST

Bandi Sanjay Fires On BRS : టీడీపీతో బీజేపీ పొత్తుకు సిద్ధమైందని వస్తున్న వార్తలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ ఖండించారు. అలాంటి గాలి వార్తలను పట్టించుకోవద్దని కోరారు. ఆదివారం వివిధ జిల్లాల నేతలతో బండి సంజయ్​ కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay Reacted To BJP Alliance With TDP : తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తుకు సిద్ధమైందని వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ కొట్టిపారేశారు. అలాంటి వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆదివారం వివిధ జిల్లాల నేతలతో బండి సంజయ్​ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో నెలాఖరు వరకు జరిగే మహజన్​ సంపర్క్​ అభియాన్​ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. గడప గడపకూ బీజేపీ పేరుతో కేంద్ర ప్రభుత్వం అందించిన అభివృద్ధి, సంక్షేమాన్ని తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

BJP Alliance With TDP : కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలను టీడీపీ అధినేత చంద్రబాబు కలిస్తే తప్పేముందని బండి సంజయ్​ ప్రశ్నించారు. గడప గడపకూ బీజేపీ పేరుతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని బీజేపీ శ్రేణులు, కార్యకర్తలకు సూచించారు. అందుకోసం ఇక నుంచి చేపట్టబోయే కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేయాలని కోరారు. కేసీఆర్​ మాదిరిగా ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను కలవకుండా ప్రగతి భవన్​కే పరిమితమై తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే నైజం బీజేపీది కాదని తెలిపారు. చంద్రబాబుతో పొత్తు గురించి చర్చించారనడం ఊహాజనితమేనని వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్​ పెరుగుతోందని అన్నారు.

Bandi Sanjay Comments On BRS And Congress : బీజేపీని దెబ్బ తీసేందుకే బీఆర్​ఎస్​, కాంగ్రెస్​తో మరికొన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలు అంతా ఏకమై పోటీ చేయనున్నాయని జోక్యం చెప్పారు. రాష్ట్ర ప్రజలు బీఆర్​ఎస్​ పాలన పట్ల విసుగు చెందారని.. ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని బండి సంజయ్‌ తెలిపారు.

అమిత్​షా, జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ : కేంద్రమంత్రి అమిత్​షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను శనివారం చంద్రబాబు నాయుడు కలిశారు. వారితో సుమారు 50 నిమిషాలు మాట్లాడారు. ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత అమిత్​షా, టీడీపీ అధినేత భేటీ కావడం ఇదే ప్రథమం. వీరి భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత చేసుకొంది. శనివారం ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్​, రామ్మోహన్​నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామమోహనరావులతో కలిసి చంద్రబాబు నాయుడు దిల్లీ వచ్చారు. వారికి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు స్వాగతం పలికారు. అనంతరం వీరు ఎంపీ గల్లా జయదేవ్​ నివాసానికి వెళ్లారు. అక్కడి నుంచి అమిత్​షా ఇంటికి వెళ్లారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.