Bandi Sanjay Comments on Cm Kcr: 'సీఎం కేసీఆర్‌వి బార్-దర్బార్ నిర్ణయాలే'

author img

By

Published : Dec 29, 2021, 7:05 PM IST

Bandi Sanjay

Bandi Sanjay Comments on Cm Kcr: సీఎం కేసీఆర్... కొత్త ఏడాది కానుకగా ‘తాగు-ఊగు’ పేరుతో బంపర్ ఆఫర్ ఇచ్చి కలెక్షన్ల మీద పడ్డారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 317 జీవోపై ఆయన మండిపడ్డారు.

Bandi Sanjay Comments on Cm Kcr: ఉద్యోగుల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌... వ్యవహరిస్తున్న తీరుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు అల్లాడిపోతుంటే... ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. తక్షణమే 317 జీవోపై పున:సమీక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన భాజపా ఉద్యమిస్తుందని ప్రకటించారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

ఒమిక్రాన్ గుర్తుకు రాలేదా..?

317 జీవో పేరుతో సీఎం కేసీఆర్... వ్యవహరిస్తున్న తీరువల్ల ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలన్నీ ఛిన్నాభిన్నం అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ఉద్యోగులంతా స్థానికేతరులుగా మారి చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల మధ్య సీనియర్, జూనియర్ పేరుతో కొట్లాటలు పెడుతున్నాడని దుయ్యబట్టారు. ప్రజా, నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలపై పోరాటాలు చేస్తుంటే‘ఒమిక్రాన్’ పేరుతో సభలు, ర్యాలీలు నిషేధించిన ముఖ్యమంత్రికి తెల్లవార్లు బార్లు, పబ్ లకు అనుమతిచ్చేటప్పుడు వైరస్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

లిక్కర్ ఆదాయమే కావాలి..!

కొత్త ఏడాది కానుకగా ‘తాగు-ఊగు’ పేరుతో బంపర్ ఆఫర్ ఇచ్చి కలెక్షన్ల మీద పడ్డారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ వ్యవహారమంతా రాత్రి బార్-దర్బార్ నిర్ణయాలేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వానా కాలం పంటకు సంబంధించి ప్రతి గింజా కొనేందుకు సిద్ధమని పదేపదే చెబుతోందన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో రాసిన లేఖకు స్పందిస్తూ 6 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు లేఖ పంపిందని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.