ETV Bharat / state

CM KCR on UCC bill : ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు మేం వ్యతిరేకం.. పార్లమెంటులో అడ్డుకుంటాం: సీఎం కేసీఆర్‌

author img

By

Published : Jul 10, 2023, 6:27 PM IST

Updated : Jul 10, 2023, 7:53 PM IST

Asaduddin Owaisi Meet with CM KCR : ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకమని బీఆర్​ఎస్​ పార్టీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ సీఎం కేసీఆర్​ అన్నారు. యూసీసీ వల్ల అన్ని మతాల వారిలో అయోమయం ఉందని ఆయన అన్నారు. బీజేపీ దేశాభివృద్ధిని విస్మరించి విద్వేష రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. సీఎం క్యాంప్​ కార్యాలయంలో అసదుద్దీన్‌ ఓవైసీ, ముస్లీం మతపెద్దలతో కేసీఆర్​ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూసీసీని వ్యతిరేకించాలని ముస్లిం మతపెద్దలు కేసీఆర్​కు వినతి పత్రం ఇచ్చారు.

Asaduddin Owaisi Meet with CM KCR
Asaduddin Owaisi Meet with CM KCR

CM KCR opposed UCC bill : యూనిఫాం​ సివిల్​ కోడ్​ పేరుతో ప్రజలను విభజించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సీఎం కేసీఆర్​ ధ్వజమెత్తారు. కేంద్రం తీసుకొస్తున్న యూసీసీ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తోందని ఆయన స్పష్టం చేశారు. దీని వల్ల అన్ని మతాల వారిలో అయోమయం ఉందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ దేశాభివృద్ధిని విస్మరించి విద్వేష రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు సీఎం క్యాంప్​ కార్యాలయంలో అసదుద్దీన్‌ ఓవైసీ, ముస్లీం మతపెద్దలతో కేసీఆర్​ భేటీ అయ్యారు.

సీఎం కేసీఆర్​ను కలిసిన ముస్లీం మతపెద్దల బృందం
సీఎం కేసీఆర్​ను కలిసిన ముస్లీం మతపెద్దల బృందం

ఈ సందర్భంగా యూసీసీని వ్యతిరేకించాలని ముస్లీం మతపెద్దలు వినతి పత్రం ఇచ్చారు. దీనికి ఆయన సానుకూలంగా హామీ ఇచ్చారు. అనంతరం మాట్లాడిన కేసీఆర్​.. యూసీసీతో ప్రత్యేక సంస్కృతి కలిగిన అన్ని జాతులు, మతాలకు ఇబ్బందని స్పష్టం చేశారు. భారత్‌.. భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఆదర్శంగా నిలిచిన భారతీయుల ఐక్యతను చీల్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం తీసుకునే నిర్ణయాలను నిర్ద్వందంగా తిరస్కరిస్తామని కేసీఆర్​ పునరుద్ఘాటించారు.

Asaduddin Owais meet with CM KCR : భేటీ అనంతరం బయటకు వచ్చిన అసదుద్దీన్​ ఓవైసీ మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న యూసీసీ బిల్లు విషయమై కేసీఆర్​తో చర్చించామని పేర్కొన్నారు. యూనిఫాం సివిల్​ కోడ్​ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. యూసీసీ పేరిట లౌకిక వాదాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. కేవలం ఇది ముస్లింల అంశం కాదని.. క్రైస్తవులు, గిరిజనులు, హిందువులకు కూడా మంచిది కాదని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని తప్పుదోవ పట్టిసున్నారని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్​ను కలిసి యూసీసీ బిల్లును వ్యతిరేకించాలని కోరినట్లు తెలిపారు. అలాగే వక్ఫ్ భూములు, పాతబస్తీ మెట్రో, మైనార్టీ రుణాలు, ఇతర సమస్యలపై సీఎంతో చర్చించామని తెలిపారు. సచివాలయం మసీదులు, ఇతర ప్రార్ధనా మందిరాలు త్వరగా ప్రారంభించాలని కోరినట్లు పేర్కొన్నారు. యూసీసీ విషయమై త్వరలోనే ఏపీ సీఎం జగన్మోహన్​ రెడ్డిని కూడా కలుస్తామన్నారు. భేటీలో ఆయనతో పాటు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఛైర్మన్​ ఖాలిద్ సైఫుల్లా రెహమానీ కూడా ఉన్నారు.

"యూనిఫామ్ సివిల్‌ కోడ్‌ను కచ్చితంగా వ్యతిరేకిస్తాం. యూనిఫామ్ సివిల్‌ కోడ్‌పై కేసీఆర్‌తో చర్చించాం. యూసీసీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పాం. గత పదేళ్లుగా తెలంగాణ చాలా ప్రశాంతంగా ఉంది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై తెలంగాణ అసెంబ్లీలోనే మొదట తీర్మానం జరిగింది. యూసీసీ ముస్లింలతో పాటు ఎవరికీ మంచిది కాదు. క్రైస్తవులు, గిరిజనులు, హిందువులకూ యూసీసీతో నష్టమే. ప్రధాని మోదీకి లౌకికవాదం అంటే అలర్జీ. యూసీసీని బీఆర్​ఎస్​ వ్యతిరేకిస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో చర్చిస్తామని చెప్పారు. "- అసదుద్దీన్​ ఓవైసీ, మజ్లిస్​ అధ్యక్షుడు

యూసీసీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు: అసదుద్దీన్​ ఓవైసీ

ఇవీ చదవండి:

Last Updated :Jul 10, 2023, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.