ETV Bharat / state

ఏపీలో తాజాగా మరో 98 కరోనా కేసులు నమోదు

author img

By

Published : Jun 4, 2020, 1:26 PM IST

.

corona
corona

ఆంధ్రప్రదేశ్​లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా మరో 98 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్త వాటితో కలిపి ఇప్పటివరకు కేసులు 3,377కు చేరాయి. కొత్తగా బయటపడిన వాటిల్లో 19 కేసులకు కోయంబేడు కాంటాక్ట్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

వైద్య పరీక్షల కోసం గత 24 గంటల వ్యవధిలో 9,986 మంది నుంచి నమూనాలు సేకరించినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి కోలుకుని 2,273 మంది డిశ్చార్జి కాగా.. 1033 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కరోనాతో తాజాగా మరో ముగ్గురు మృతిచెందగా.... రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వైరస్​తో మరణించినవారి సంఖ్య 71కి చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.