ETV Bharat / state

సమీక్షలోనే అస్వస్థతకు గురైన ఏపీ సీఎస్.. ఆసుపత్రికి తరలింపు

author img

By

Published : Nov 3, 2022, 3:46 PM IST

AP CS SAMEER SHARMA HOSPITALIZED : ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. సమీక్ష నిర్వహిస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురైన ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

సమీక్షలోనే అస్వస్థకు గురైన ఏపీ సీఎస్.. ఆసుపత్రికి తరలింపు
సమీక్షలోనే అస్వస్థకు గురైన ఏపీ సీఎస్.. ఆసుపత్రికి తరలింపు

AP CS SAMEER SHARMA :ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌శర్మ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురైన ఆయనను అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇటీవల సమీర్‌శర్మ ఇదేవిధంగా అస్వస్థతకు గురవ్వడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు.

చికిత్స నిర్వహించిన అనంతరం సీఎస్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. తర్వాత యథావిధిగా విధులకు హాజరవుతున్న ఆయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.