MMTS: గణేశ్​ నిమజ్జనం సందర్భంగా అదనంగా మరో 8 ఎంఎంటీఎస్​ సర్వీసులు

author img

By

Published : Sep 19, 2021, 5:22 AM IST

MMTS: గణేశ్​ నిమజ్జనం సందర్భంగా అదనంగా మరో 8 ఎంఎంటీఎస్​ సర్వీసులు

గణేశ్​ నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే మరో 8 ఎంఎంటీఎస్​ సర్వీసులను నడపనుంది. ఉదయం 8:45 గంటల నుంచి రాత్రి 11:20 గంటల వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

గణేశ్​ నిమజ్జనం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. రోజూ నడిపించే ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు అదనంగా మరో 8 ఎంఎంటీఎస్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.

లింగంపల్లి నుంచి హైదరాబాద్​కు మూడు, హైదరాబాద్ నుంచి లింగంపల్లికి రెండు, ఫలక్​నుమా నుంచి లింగపల్లికి రెండు, లింగంపల్లి నుంచి ఫలక్​నుమా ఒక ఎంఎంటీఎస్​ సర్వీసు అందుబాటులో ఉండనుంది. ఈ సర్వీసుల సేవలు ఉదయం 8:45 గంటల నుంచి రాత్రి 11:20 గంటల వరకు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: Ganesh immersion: గణేశ్ నిమజ్జనం సందర్భంగా భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.