ETV Bharat / state

ఎలక్ట్రానిక్ షోరూంలో సందడి చేసిన సురభి

author img

By

Published : Jan 26, 2021, 6:20 AM IST

actress surabhi launch samsung galaxy s21 in hyderabad
ఎలక్ట్రానిక్ షోరూంలో సందడి చేసిన సురభి

కథానాయిక సురభి హైదరాబాద్​లో సందడి చేశారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూంలో శ్యామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌-21 స్మార్ట్‌ఫోన్‌ను ఆమె మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా తన కొత్త సినిమా ముచ్చట్లను అభిమానులతో పంచుకున్నారు.

ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ స్మార్ట్ ఫోన్​ను వాడుతున్నారని కథానాయిక సురభి అన్నారు. హైదరాబాద్​లో ప్రముఖ ఎలక్ట్రానిక్‌ షోరూంలో శ్యామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌-21 స్మార్ట్‌ఫోన్‌ను ఆమె మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫోటోలకు ఫోజులిస్తూ.. అభిమానులతో స్వీయ చిత్రాలు తీసుకున్నారు.

కథానాయకుడు ఆదితో తాను నటించిన 'శశీ' చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుందని ఆమె తెలిపారు. ఆ సినిమా తనకు మంచి పేరు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: గాన గంధర్వుడికి పురస్కారాలు దాసోహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.