ETV Bharat / state

మహానీయుల త్యాగం వల్లే ఈ స్వాతంత్య్ర వజ్రోత్సవాలన్న చిరంజీవి

author img

By

Published : Aug 15, 2022, 11:29 AM IST

Updated : Aug 15, 2022, 11:42 AM IST

Chiranjeevi రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో సీనినటుడు చిరంజీవి పాల్గొన్నారు. ఎందరో మహనీయుల త్యాగఫలమే ఈ వేడుకలని ఆయన అన్నారు.

చిరంజీవి
చిరంజీవి

ఎందరో మహనీయుల త్యాగఫలమే స్వాతంత్ర్య వేడుకలన్న చిరంజీవి

Chiranjeevi: రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవాలు వైభవంగా జరిగాయి. హైదరాబాద్​లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్​లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో సీనినటుడు చిరంజీవి పాల్గొన్నారు. ఎందరో మహనీయుల త్యాగఫలమే ఈ వేడుకలని ఆయన అన్నారు. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జరుపుకోవడం ఆనందగా ఉందని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఎందరో మహనీయులను కన్న మాతృమూర్తులను సర్మించుకొని వారికి నివాళులు ఆర్పించడం కనీస ధర్మంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి జాతీయ జెండాను ఎగురవేశారు.

"75 సంవత్సరాలు అంటే వజ్రోత్సవ పండుగ మనం చేసుకోవడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంత స్వాతంత్య్రాన్ని మనకు కలుగజేయడానికి కారణం అయిన స్వాతంత్య్ర సమరయోధులు, మహానీయుల త్యాగం వల్లే ఈ వజ్రోత్సవాలు. స్వాతంత్య్ర సమరంలోకి వెళ్లండి అంటూ ధైర్యంగా పంపిచిన కన్న తల్లులను కొనియాడాలి. అలాంటి కన్నతల్లులను స్మరించుకొని నివాళులు ఆర్పించడం కనీస ధర్మంగా భావిస్తున్నాను. - చిరంజీవి సీనినటుడు

ఇవీ చదవండి:హైదరాబాద్‌ సిగలో కీర్తి కిరీటాలెన్నో, 75 ఏళ్ల అభివృద్ధి ప్రస్థానం ఇదీ

చరిత్రగతి మార్చిన ఉద్యమం, గాంధీజీ నేతృత్వంలో స్వాతంత్ర్యం

Last Updated : Aug 15, 2022, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.