ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో భారీ సంఖ్యలో అభ్యర్థులు!

author img

By

Published : Feb 25, 2021, 4:56 AM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ సంఖ్యలోనే అభ్యర్థులు బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నామినేషన్ల పరిశీలన అనంతరం రెండు నియోజకవర్గాల్లోనూ పెద్దసంఖ్యలోనే అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో భారీ సంఖ్యలో అభ్యర్థులు!
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో భారీ సంఖ్యలో అభ్యర్థులు!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు రెండు నియోజకవర్గాల్లోను పెద్దసంఖ్యలో పోటీలో ఉన్నారు. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్​నగర్ నియోజకవర్గంలో ఏకంగా 96 మంది అభ్యర్థులు ఉన్నారు. నల్గొండ - వరంగల్ - ఖమ్మం నియోజకవర్గంలో 74 మంది బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు రేపు సాయంత్రం వరకు గడువుంది. ఉపసంహరణ గడువు ముగిస్తే అభ్యర్థిత్వాలపై పూర్తి స్పష్టత వస్తుంది.

ఉమ్మడి రాష్ట్రంలో 2007లో శాసనమండలి పునరుద్ధరణ సమయంలో జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్​నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అత్యధికంగా 57 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు భారీసంఖ్యలో స్వతంత్రులు పోటీ చేశారు. భారీ బ్యాలెట్ ఉపయోగించడంతో ఓట్ల లెక్కింపునకు అప్పట్లో రెండున్నర రోజుల సమయం పట్టింది. ఈ మారు ఎంత మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలబడతారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చూడండి: 'ఎన్నికల ప్రచారానికి కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.